
గేటెడ్ కమ్యూనిటీల్లో ప్లాట్లు నిర్మించాలి
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలో గెజిటెడ్ అధికారుల కోసం గేటెడ్ కమ్యూనిటీలా ప్లాట్లు నిర్మించాలని టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీని వాసరావు అన్నారు. టీజీఓ భవనంలో ఆదివారం జరిగిన తెలంగాణ గెజిటెడ్ అధికారుల హౌస్ బిల్డింగ్ సోసైటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మంలోని రాజీవ్ స్వగృహ ప్లాట్లు 576 ఉన్నాయని, సొసైటీలో 975 మంది సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. సభ్యత్వం తీసుకున్న వారు జూలై 10 లోపు ఎన్ఎస్టీ రోడ్డులోని ఎస్బీఐలో రూ. 2లక్షలు డిపాజిట్ చేయాలని, ఆలా చేసిన వారిలో 576 మందికి ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు. అంతకంటే ఎక్కువ మంది డిపాజిట్ చేస్తే లాటరీ ద్వారా ఎంపిక చేస్తామన్నారు. సమావేశంలో టీజీఓస్ జిల్లా అధ్యక్షుడు కస్తాల సత్యనారాయణ, కార్యదర్శి మోదుగు వేలాద్రి, టీఎన్జీఓస్ జేఏసీ చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు, వాసిరెడ్డి శ్రీనివాస్, కొండపల్లి శేషుకుమార్, రమేష్, మహేష్బాబు, సుధారాణి, డాక్టర్ సంజయ్, గంగవరపు బాలకృష్ణ, జయపాల్ తదితరులు పాల్గొన్నారు.
టీజీఓ రాష్ట్ర అద్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు