
నయా ఫాసిస్టు పోకడలతో ప్రమాదకరం
ఖమ్మంమయూరిసెంటర్: దేశంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నయా ఫాసిస్టు పోకడలతో కూడిన పాలన కొనసాగిస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం విమర్శించా రు. స్థానిక సుందరయ్య భవనంలో సీపీఎం ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు బండారు రమేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నరేంద్రమోదీ 11 ఏళ్ల పరిపాలనలో కార్పొ రేట్ సంస్థలకు లబ్ధి జరిగేలా నిర్ణయాలు జరిగాయ ని తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజలు, గ్రామీణ రైతాంగం, పట్టణ కార్మిక వర్గాలు ఆశించిన అభివృద్ధిని సాధించలేదని, దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి నిరుద్యోగం తారాస్థాయికి చేరిందని, ప్రజల కొనుగోలు శక్తి హీన స్థాయికి దిగజారిందని పేర్కొన్నా రు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధి వేగం పుంజుకున్నప్పుడు దేశంలో, సేవారంగంలో సైతం అభివృద్ధి కనబడుతుందని చెప్పారు. లౌకిక, సామ్యవాద స్ఫూర్తికి నిలువుటద్దంగా నిలిచిన భారత రాజ్యాంగాన్ని సైతం నిర్వీర్యం చేయడానికి బీజేపీ పూనుకుంటోందని విమర్శించారు. తన మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల ద్వారా నయా ఫాసిస్ట్ పోకడలతో కూడిన చర్యలను చేపడుతోందని, ప్రజలు గమనించాలని తమ్మినేని కోరారు. సమావేశంలో నున్నా నాగేశ్వరరావు, ఎం.సుబ్బారావు, పొన్నం వెంకటేశ్వరరావు, బండి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు
తమ్మినేని వీరభద్రం