ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలి | - | Sakshi
Sakshi News home page

ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలి

Jun 30 2025 4:19 AM | Updated on Jun 30 2025 4:19 AM

ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలి

ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలి

భద్రాచలం: పునర్విభజనలో భాగంగా ఏపీలో కలిసిన ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వినతిపత్రం అందజేశారు. నిజామాబాద్‌లో పసుపుబోర్డు ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఏపీలో కలిపిన భద్రాచలం చుట్టుపక్కల గ్రామాలైన ఎటపాక, కన్నాయిగూడం, పిచుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నంలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కోరారు. వీటివల్ల పరిపాలనా, అభివృద్ధి పనుల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. భద్రాచలం పట్టణం, తెలంగాణ ప్రధాన మండలాల మధ్య రవాణా అంతరాయం ఏర్పడుతోందని, భద్రాచలంలోని విద్యాసంస్థల్లో చదివే గిరిజన విద్యార్థులకు రాకపోకల్లో రెండు రాష్ట్రాల చెక్‌పోస్టుల వల్ల గిరిజనులు, వాణిజ్య వాహనాలకు ఇబ్బందులు కలుగుతున్నాయని వివరించారు.

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు

రాష్ట్ర మంత్రి తుమ్మల వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement