
కాల్వలోకి దూసుకెళ్లిన లారీ
వైరా: వైరా వైపు నుంచి జగ్గయ్యపేట వెళ్తున్న ఓ లారీ ఆదివారం అదుపుతప్పి రిజర్వాయర్ ఎడమ కాల్వలో పడింది. గ్రీన్ఫీల్డ్ రహదారి పనులు జరుగుతున్న సోమవరం ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్ వద్ద లారీడ్రైవర్ సడన్గా బ్రేక్ వేయడంతో వెనక వస్తున్న మరో లారీ వచ్చి ఢీకొట్టింది. దీంతో లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న రిజర్వాయర్ ఎడమ కాల్వలోకి దూసుకెళ్లింది. లారీడ్రైవర్కు స్వల్ప గాయాలతో బయటపడటంతో ప్రమాదం తప్పినట్లయింది.
యువకుడి ఆత్మహత్యాయత్నం
నేలకొండపల్లి: ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకా.. మండలంలోని మోటాపురం గ్రామానికి చెందిన రాజేశ్ (24) ఆదివారం అధికంగా టాబ్లెట్లు వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి నేలకొండపల్లి ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స చేయించి.. ఖమ్మం తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
నగరవాసిపై పీడీ యాక్ట్ కేసు
ఖమ్మంఅర్బన్: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడన్న ఆరోపణలపై పగడాల విజయ్ అలియాస్ చంటిపై పోలీస్ శాఖ పీడీ యాక్ట్ను ప్రయోగించింది. ఖమ్మంఅర్బన్ పోలీస్స్టేషన్ పరిధిలో విజయ్ పలు నేరాలకు పాల్పడినందున ఈ చర్య తీసుకున్నట్లు సీపీ ఎస్.సునీల్దత్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. నగరంలోని అగ్రహారం న్యూ కాలనీకి చెందిన పగడాల విజయ్ కొంతకాలంగా హత్యాయత్నం, దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపు లు, గుండాగిరి కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నా డు. పలుమార్లు పోలీసులు అరెస్టు చేసినప్పటికీ జామీన్పై విడుదలై మళ్లీ అదేతరహా నేరాలకు పాల్పడుతూ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో విజయ్ను అదుపులోకి తీసుకుని, ఖానాపురం హవేలి (ఖమ్మంఅర్బన్) పోలీస్స్టేషన్ సీఐ భానుప్రకాష్ నేతృత్వంలో హైదరాబాద్ చంచల్గూడ సెంట్రల్ జైలుకు తరలించామని కమిషనర్ వివరించారు.
గంజాయి పట్టివేత
పాల్వంచ: కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నా రు. ఆదివారం పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ సతీశ్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 28వ తేదీ సాయంత్రం స్థానిక రెజీనా కాన్వెంట్ సమీపంలో ఎస్ఐ సుమన్ వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన కారు ను ఆపేందుకు యత్నించగా.. అందులో నుంచి ముగ్గురు వ్యక్తులు పారిపోయారు. మరో ముగ్గురితోపాటు 11.100 కేజీల గంజాయి పట్టుబడింది. వారు చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన కందిమళ్ల శ్రీహరి, జొన్నలగడ్డ రాకేశ్రెడ్డి, బోనకల్ మండలం ముష్టికుంట్లవాసి ఎస్కే జావిద్గా గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని సీఐ తెలిపారు.
రేషన్ బియ్యం..
కల్లూరు: మండలంలోని చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన కారుకుల నరసింహారావు, కారుకుల సత్యం తమ ఇళ్లలో 12 క్వింటాళ్ల రేషన్ బియ్యం నిల్వ ఉంచారనే సమాచారం మేరకు పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దాడి చేశారు. 12 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాలశాఖ డీటీ సత్యనారాయణకు అప్పగించారు.