వృద్ధగిరి.. అభివృద్ధికి నిధులేవి.. | - | Sakshi
Sakshi News home page

వృద్ధగిరి.. అభివృద్ధికి నిధులేవి..

Jun 9 2025 12:52 AM | Updated on Jun 9 2025 12:52 AM

వృద్ధ

వృద్ధగిరి.. అభివృద్ధికి నిధులేవి..

ముదిగొండ : కాకతీయుల కాలం నాటి అతి పురాతన దేవాలయం, వృద్ధగిరి కొండపై స్వయంభూగా వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి నిధులు లేక అబివృద్ధికి నోచుకోవడం లేదు. ముదిగొండ మండలం సువర్ణాపురం రెవెన్యూ పరిధిలో ఖమ్మం – కోదాడ జాతీయ రహదారికి సమీపంలో ఈ ఆలయం ఉండడంతో సందర్శకులు, భక్తులు అఽధిక సంఖ్యలో వస్తుంటారు. దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి దాదాపు 40ఎకరాల భూమి ఉండగా.. కౌలు రూపంలో వచ్చే ఆదాయం ధూప, దీప నైవేద్యాలకు, ఇతర ఉత్సవాలకు సరిపోతాయి. ఇక ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు లేక, ఆలయంలో సరైన సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్‌, తాగునీరు, మెట్ల మార్గం, రహదారి, ఆర్చీలతో పాటు గదులు నిర్మించాలని కోరుతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముదిగొండ మండల పర్యటనకు వచ్చినప్పుడల్లా ఆలయ అబివృద్ధికి నిధులు మంజూరు చేయాలని అర్చకులు వినతిపత్రాలు సమర్పిస్తూనే ఉన్నారు. ఆలయ ప్రాంగణంలో విద్యుత్‌ లైన్‌తో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రజలు, భక్తులు కోరుతున్నారు.

వృద్ధగిరి.. అభివృద్ధికి నిధులేవి..1
1/1

వృద్ధగిరి.. అభివృద్ధికి నిధులేవి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement