
ఉమ్మడి జిల్లాలో గోదావరి పరవళ్లు
ఏన్కూరు: గోదావరి జలాలతో ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా సీతారామ ఎత్తిపోతల పథకం సిద్ధమవుతోందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందులో కీలకమైన రాజీవ్ కెనాల్ పనులు 8.86 కి.మీ.ల్లో 7.86 కి.మీ. మేర పూర్తయినందున, వైరా, మధిర, సత్తుపల్లి, అశ్వరావుపేట నియోజకవర్గాలకు సాగునీరు అందనుందని వెల్లడించారు. ఏన్కూరు సమీపాన రాజీవ్ కెనాల్(ఏన్కూరు లింక్ కెనాల్) పనులను మంగళవారం మంత్రి పరిశీలించి మాట్లాడారు. ఈనెల 10వ తేదీకల్లా కెనాల్ పనులు పూర్తి కానుండగా, పుష్కలంగా సాగునీరు అందుతుందన్నారు. కాగా, సత్తుపల్లి, అశ్వరావుపేట నియోజకవర్గాలకు సాగునీరు అందించేలా యాతాలకుంట టన్నెల్ నిర్మిస్తున్నామన్నారు. సాగర్ ద్వారా కృష్ణా జలాలు రావడానికి రెండు నెలల ముందుగానే ఖమ్మం జిల్లా రైతులకు గోదావరి జలాలు అందించాలన్నది తమ సంకల్పమని మంత్రి తెలిపారు.
లింక్ కెనాల్ పనులు పరిశీలించిన
మంత్రి తుమ్మల