
ప్రపంచంతో పోటీ పడేలా అభివృద్ధి
వైరా: తెలంగాణ యువత ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అందులో భాగంగానే ప్రణాళికాయుతంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. వైరాలోని ప్రభుత్వ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన మెగా జాబ్మేళాను డిప్యూటీ సీఎం ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ రంగాల్లో నియామకాలు చేపడుతూనే, యువత ఉపాధి కోసం ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలకు జాబ్మేళాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఉద్యోగం చేస్తూనే లక్ష్యసాధనకు ప్రయత్నించాలని సూచించారు.
రూ.100కోట్ల వ్యయంతో సాగునీరు
వైరా రిజర్వాయర్, సాగర్ కాల్వల ద్వారా ఇతర చెరువులకు సమృద్ధిగా గోదావరి నీరు అందించా లనే లక్ష్యంతో సీతారామ ఎత్తిపోతల పథకం కింద ప్రత్యేకంగా రూ.100కోట్ల వ్యయంతో రాజీవ్ కెనాల్ నిర్మించామని భట్టి తెలిపారు. వైరా రిజర్వాయర్ కాల్వల ఆధునికీకరణకు రూ.44 కోట్లు మంజూరు చేశామన్నారు. అలాగే, పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యనందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. అంతేకాక ఐటీఐని అడ్వా న్స్డ్ టెక్నాలజీ సెంటర్గా అప్గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపారు. వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ సహకారంతో జాబ్మేళా విజయవంతంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఆతర్వాత ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, సింగరేణి సీఎండీ బలరామ్ నాయక్ తదితరులు మాట్లాడారు. కాగా, వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన యువతకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియామకపత్రాలు అందజేశారు. జాబ్మేళాకు 5వేల మందికి పైగా నిరుద్యోగ యువత హాజరుకాగా, 92కంపె నీల్లో 4,448 మందిని ఎంపిక చేసి నియామక పత్రాలు అందజేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర గిడ్డంగులు, హస్తకళల సంస్థల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, సింగరేణి జీఎం శాలేం రాజు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, నూతి సత్యనారాయణ, శీలం వెంకటనర్సిరెడ్డి, దొబ్బల సౌజన్య, దార్న రాజశేఖర్, బానోత్ విజయబాయి, కోసూరి శ్రీను, పమ్మి అశోక్ పాల్గొన్నారు.
ప్రణాళికాయుతంగా
యువతకు ఉపాధి అవకాశాలు
వైరా జాబ్మేళాలో
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
పోటెత్తిన నిరుద్యోగులు – 8లో...