కాల్వలు అధ్వానం.. | - | Sakshi
Sakshi News home page

కాల్వలు అధ్వానం..

May 5 2025 8:48 AM | Updated on May 5 2025 8:48 AM

కాల్వ

కాల్వలు అధ్వానం..

ఎన్నెస్పీ కాల్వలు పదేళ్లుగా మరమ్మతులకు నోచుకోక అధ్వానంగా తయారయ్యాయి. పూడికతో నీటి సరఫరా సాగడం లేదు.
● జిల్లాలో 6 కేంద్రాలు, 2,739 మంది విద్యార్థులు ● ఉదయం 11 గంటలకే పరీక్ష కేంద్రాల వద్దకు.. ● చివరి నిమిషంలో కొందరి ఉరుకులు.. పరుగులు

వాతావరణ ం

జిల్లాలో సోమవారం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కొన్నిచోట్ల ఆకాశం మేఘావృతమై ఉంటుంది. చిరు జల్లులు పడే అవకాశం ఉంది.

సోమవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2025

10లో

పరీక్ష బాగా రాశాను

నగరంలోని ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాలలో పరీక్ష రాశాను. మొత్తం 720 మార్కులకు గాను మంచి మార్కులు వస్తాయనే నమ్మకం ఉంది. బోటనీ, జువాలజీ బాగా రాశాను. ఫిజిక్స్‌ సబ్జెక్ట్‌ రాసేందుకు సమయం సరిపోలేదు. ప్రశ్నలు ఇన్‌ డైరెక్ట్‌ మెథడ్‌తో రావడంతో పాటు ప్రశ్నాపత్రం లెంథీగా(పెద్దగా) వచ్చింది. దీంతో ఆలోచించి పరీక్ష రాయాల్సి వచ్చింది.

– ఆదిబా ఫర్జీన్‌, విద్యార్థిని

ప్రశ్నపత్రం కఠినంగా ఉంది

నీట్‌లో కొన్ని సబ్జెక్ట్‌లు కఠినంగా వచ్చాయి. బోటనీ సులభంగా ఉండగా జువాలజీ పర్వాలేదు. ఫిజిక్స్‌ కఠినంగా వచ్చింది. దీంతో పాటు ప్రశ్నలు పెద్దగా ఉండడంతో ఎక్కువ సమయం పట్టింది. కెమిస్ట్రీ కూడా కొంత కఠినంగానే ఉంది. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పరీక్ష ప్రశాంతంగా రాశా. మంచి మార్కులు వస్తాయనే నమ్మకం ఉంది.

– కొల్ల సాయిజశ్వంత్‌

ఖమ్మం సహకారనగర్‌ : 2025 – 26 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశానికి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ(ఎన్‌టీఏ) ఆదివారం నిర్వహించిన నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌) జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం నగరంలో ఆరు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 2,739 మంది విద్యార్థులకు గాను 2,671 మంది హాజరయ్యారు. 68 మంది గైర్హాజరయ్యారు. ఈ పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. పరీక్ష కేంద్రాల్లోకి ఉదయం 11 గంటల నుంచే అనుమతిస్తామని అధికారులు ముందుగానే ప్రకటించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు 10.30 గంటల నుంచే కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులను కేంద్రాల్లోకి పంపించే సమయంలో పోలీస్‌ సిబ్బంది, ఇతరులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నగరంలో అడిషనల్‌ డీసీపీ, ఇతర పోలీసులతో పాటు, పలు శాఖల సిబ్బంది విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచనలు, సలహాలు అందించారు.

ఉరుకులు.. పరుగులు

మధ్యాహ్నం 1.30 గంటల వరకే పరీక్షకు అనుమతిస్తామని అధికారులు ముందుగానే ప్రకటించినా, హాల్‌ టికెట్లపై నిబంధనలు పొందుపర్చినా ఒకరిద్దరు విద్యార్థులు చివరి క్షణంలో ఉరుకులు, పరుగులతో హాజరయ్యారు. నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌ బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల, యూనివర్సిటీ పీజీ కళాశాల పరీక్ష కేంద్రాలు పక్కపక్కనే ఉండడంతో కొందరు అటువారు ఇటు, ఇటువారు అటు రావడంతో అధికారులు ఆయా కేంద్రాలకు వెళ్లేలా సూచనలు చేశారు. ఇక ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రానికి ఓ విద్యార్థిని 4 నిమిషాలు ఆలస్యంగా రావడంతో అధికారులు వెనక్కు పంపించారు. ఇతర కేంద్రాల వద్ద కూడా ఆలస్యంగా వచ్చిన వారికి అనుమతించలేదు.

పరీక్ష రాసిన తల్లీకూతుళ్లు..

ఖమ్మం నగరానికి చెందిన తల్లీ కూతుళ్లు నీట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. తల్లి బి.సరితకు సూర్యాపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో, కూతురు బి.కావేరికి ఖమ్మం ఎన్నెస్సీ కాలనీ ప్రభుత్వ పాఠశాల కేంద్రాల్లో పరీక్ష రాశారు.

పిల్లలతో పరీక్ష కేంద్రానికి ఎమ్మెల్యే..

సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి ఇద్దరు పిల్లలు నీట్‌ రాయగా వారిని ఆమె కేంద్రాల వద్దకు తీసుకెళ్లారు. ఒకరికి ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాల పరీక్షా కేంద్రం కాగా.. మరొకరికి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కేటాయించారు.

ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు

న్యూస్‌రీల్‌

కాల్వలు అధ్వానం..
1
1/5

కాల్వలు అధ్వానం..

కాల్వలు అధ్వానం..
2
2/5

కాల్వలు అధ్వానం..

కాల్వలు అధ్వానం..
3
3/5

కాల్వలు అధ్వానం..

కాల్వలు అధ్వానం..
4
4/5

కాల్వలు అధ్వానం..

కాల్వలు అధ్వానం..
5
5/5

కాల్వలు అధ్వానం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement