ఐక్యరాజ్య సమితి సదస్సులో జిల్లా వాసి | - | Sakshi
Sakshi News home page

ఐక్యరాజ్య సమితి సదస్సులో జిల్లా వాసి

Mar 20 2025 12:25 AM | Updated on Mar 20 2025 12:24 AM

ఖమ్మం మామిళ్లగూడెం: న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ‘మహిళల సాధికారత – సామాజిక స్థితిగతులు’ అంశంపై జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆఫ్‌ కల్చర్‌ అండ్‌ డిప్లొమాటిక్‌ రిలేషన్స్‌ అసిస్టెంట్‌ సెక్రటరీ జనరల్‌, ఖమ్మంకు చెందిన డాక్టర్‌ ఏలూరి సునీత పాల్గొన్నారు. మహిళా సాధికారతను సమర్థించడం, ఆధునిక సాంకేతికత ఉపయోగాన్ని మెరుగుపర్చడం తదితర అంశాలపై ఆమె కీలక సూచనలు చేశారు. అలాగే, మహిళలు ఎదుర్కొంటున్న సైబర్‌ వేధింపులు, డిజిటల్‌ అసమానతలు, ఆన్‌లైన్‌ భద్రతా సమస్యల పరిష్కారంపైనా మాట్లాడారు. మహిళల ఆరోగ్యం, మాతృత్వ సంరక్షణ, శిశు సంక్షేమం, లింగ సమానత్వం కోసం పకడ్బందీ చర్యలు చేపట్టాలని, లింగ సమానత్వంపై విద్యార్థి దశలోనే అవగాహన పెంచేలా విద్యావ్యవస్థలో కోర్సులు ప్రవేశపెట్టాలని సూచనలు చేశా రు. కాగా, మహిళా సాధికారతకు అనుకూలమైన విధానాలను ప్రోత్సహించేలా అన్ని దేశాల బా ధ్యులు పరస్పర సహకారం అందించుకోవాలని ఈ సమావేశాల్లో నిర్ణయించినట్లు ఆమె తెలిపారు.

‘మహిళా సాధికారత’పై మాట్లాడిన సునీత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement