చింతకాని: మండలంలోని పాతర్లపాడుకు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి నెల్లూరి రమేష్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఎంపికయ్యాడు. ఆయన కొన్నేళ్లు ఆర్మీలో విధులు నిర్వర్తించాక 2016లో రిటైర్మెంట్ తీసుకున్నాడు. అనంతరం 2018లో గ్రామపంచాయతీ కార్యదర్శిగా ఎంపికై నా 2020లో రాజీనామా చేశాడు. ఆతర్వాత బీఈడీ చదివిన రమేష్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఎంపిక కాగా, పలువురు అభినందించారు.
నవ్య.. మరో ఉద్యోగం
తల్లాడ: మండలంలోని మంగాపురానికి చెందిన గాదె నవ్య మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో రెండో ఉద్యోగం సాదించింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో సూపరింటెండెంట్ ఉద్యోగానికి అర్హత సాధించిన ఆమె, బుధవారం వెలువడిన గ్రేడ్–1 సూపర్వైజర్ ఫలితాల్లోనూ రాష్ట్రస్థాయి 89, జోన్లో 9వ ర్యాంక్ సాధించడం విశేషం. నవ్య భర్త పరచూరి రమేష్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
తొమ్మిదో తరగతి విద్యార్థినితో అసభ్య ప్రవర్తన
టేకులపల్లి: విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన డిప్యూటీ వార్డెన్ను తల్లిదండ్రులు, గ్రామస్తులు బుధవారం చితకబాదారు. టేకులపల్లి మండలంలోని గంగారం ఆశ్రమ పాఠశాల డిప్యూటీ వార్డెన్(హిందీ టీచర్) మాలోత్ ప్రతాప్సింగ్ మంగళవారం మద్యం తాగి విధులకు హాజరయ్యాడు. మధ్యాహ్నం పాఠశాల ఆవరణలో తొమ్మిదో తరగతి బాలికపై చేతులు వేసి అసభ్యంగా మాట్లాడుతూ ఇబ్బందికి గురి చేశాడు. దీంతో ఆమె డిప్యూటీ వార్డెన్ను నెట్టేయగా, అదే సమయంలో వంట చెరకు డబ్బుల కోసం వచ్చిన గ్రామస్తులకు విషయం తెలిపింది. దీంతో వారు ప్రశ్నించగా తప్పయిందని చెప్పి ప్రతాప్ వెళ్లిపోయాడు. గ్రామస్తులు విషయం తెలపడంతో బాలిక తల్లిదండ్రులు, గ్రామపెద్దలు, బంధువులు రాత్రి పాఠశాలకు రాగా, డిప్యూటీ వార్డెన్ అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో బుధవారం మళ్లీ వారంతా పాఠశాలకు వచ్చి డిప్యూటీ వార్డెన్, హెచ్ఎంలను నిలదీశారు. డిప్యూటీ వార్డెన్ పశ్చాత్తాపం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చితకబాదడంతో పారిపోయాడు. బోడు ఎస్ఐ పొడిశెట్టి శ్రీకాంత్, డిప్యూటీ తహసిల్దార్ ముత్తయ్య, ఏటీడీవో రాధ పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. కాగా, డిప్యూటీ వార్డెన్పై హెచ్ఎం జగన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పాఠశాల నుంచి తిరిగి వెళ్తున్న బోడు పోలీసులకు డిప్యూటీ వార్డెన్ తారస పడటంతో అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు.
డిప్యూటీ వార్డెన్ను చితకబాదిన గ్రామస్తులు
హెచ్డబ్ల్యూఓగా రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి