సత్తుపల్లిటౌన్: పిండి వంటలు చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయి పైపు నుంచి మంటలు వ్యాపించిన ఘటన బుధవారం సత్తుపల్లిలో చోటుచేసుకుంది. పట్టణంలోని ద్వారకాపురి కాలనీకి చెందిన జెరిపిటి వెంకటేశ్వరరావు ఇంట్లో కుటుంబ సభ్యులు కలిసి ఇంటి వరండాలో పిండి వంటలు చేసేందుకు గ్యాస్ పొయ్యి వెలిగింయారు. పైపు లీక్ కావటంతో మంటలు వ్యాపించడంతో మహిళలు దూరంగా వెళ్లిపోయారు. ఫైరింజన్కు సమాచారం అందించటంతో వీధిలో కొద్దిదూరం వరకు వచ్చి రోడ్డు ఇరుకుగా ఉండటంతో ఆగిపోయింది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే సుమారు రూ.2 లక్షల విలువైన సామగ్రి దగ్ధమైనట్లు బాధితులు తెలిపారు.
యువతి అదృశ్యం
చింతకాని: మండలంలోని నేరడ గ్రామానికి చెందిన యువతి కనిపించకుండా పోయినట్లు స్థానిక పోలీస్స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 8వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవటంతో ఆమె తల్లి నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ నాగుల్మీరా తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి
కొణిజర్ల: గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన మండలంలోని శాంతినగర్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్ఐ జి.సూరజ్, స్థానికుల కథనం ప్రకారం.. వైరా మున్సిపాలిటీ పరిధిలోని కొణిజర్ల మండలం దిద్దుపూడికి చెందిన అమర్లపూడి పుల్లయ్య (63) షుగర్ వ్యాధి పరీక్ష చేయించుకునేందుకు గాను తన ద్విచక్రవాహనంపై వైరా వెళ్తున్నాడు. దిద్దుపూడి అడ్డరోడ్డు వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సూరజ్ తెలిపారు. పుల్లయ్య సీపీఐ కార్యకర్త కావడంతో ఆ పార్టీ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, యర్రా బాబు, దొండపాటి రమేశ్, కొండపర్తి గోవిందరావు, పవన్, నాగభూషణం, లాజర్, గోపాల్రావు, వెంకటేశ్వర్లు, దావీదు నివాళులర్పించారు.
లింక్ ఓపెన్ రూ.3.50 లక్షలు మాయం
కూసుమంచి: కూసుమంచికి చెందిన పుసులూరి ఉపేందర్ ఖాతా నుంచి తనకు తెలియకుండానే రూ.3.50 లక్షల నగదును సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఉపేందర్ సెల్కు పీఎం కిసాన్ పేరుతో ఓ లింక్ రాగా దాన్ని ఓపెన్ చేశాడు. దీంతో అతని ఖాతా నుంచి సోమవారం రూ.2 లక్షలు, మంగళవారం ఉదయం మరో రూ.1.50 లక్షలు మాయమయ్యాయి. ఉపేందర్ వరి కోత మిషన్లను లీజుకు తీసుకుని నడుపుతుండగా వాటికి అడ్వాన్స్ చెల్లించేందుకు ఫోన్పేను ఓపెన్ చేసి డబ్బులు పంపేందుకు యత్నించగా ఖాతాలో నగదు లేకపోవటాన్ని గుర్తించాడు. తాను మోసపోయానని గ్రహించి ఖమ్మంలోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా వారు విచారణ చేపట్టారు. పీఎం కిసాన్ లింక్ ఓపెన్ చేయటం వలనే నగదును సైబర్ నేరగాళ్లు డ్రా చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలిందని బాధితుడు తెలిపాడు. ◘
షార్ట్ సర్క్యూట్తో ఎలకి్ట్రకల్ షాప్ దగ్ధం
తిరుమలాయపాలెం: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఎలక్ట్రికల్ షాప్ దగ్ధమైన ఘటన బుధవారం మండలంలోని కాకరవాయి గ్రామంలో చోటుచేసుకుంది. శ్రీరామ ఎలకి్ట్రకల్ షాప్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. షాప్లోనే నివాసం ఉండటంతో సామగ్రి దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లిందని రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. నష్టపోయిన తనను ప్రభుత్వం ఆదుకోవాలని షాపు నిర్వాహకుడు రాము వేడుకుంటున్నాడు.
రూ.2 లక్షల ఆస్తి నష్టం
గ్యాస్ లీక్ అయి వ్యాపించిన మంటలు
గ్యాస్ లీక్ అయి వ్యాపించిన మంటలు