రాయచూరు రూరల్: సాధువులు, సంతుల వేషంలో వచ్చి బంగారు, నగదును మా యం చేసిన ఉదంతం రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన వారం రోజుల క్రితం సింధనూరులో జరిగింది. సింధనూరు– కుష్టిగి రహదారిలో మందుల దుకాణాన్ని నడుపుకుంటున్న టింకు, భర్త విష్ణుదత్తలకు సాధువు వచ్చి బూడిద అంటించి వారి వద్ద నుంచి బంగారు, డబ్బులు తీసుకొని పరారయ్యాడు. తాగునీటి కోసం వచ్చిన సాధువు ఆ నీటిని ఎందుకు తాగుతారు అని ఫ్రిజ్లో నుంచి చల్లని నీరు తీసి ఇచ్చారు. సాధువు వెంటనే దుకాణం ముందుకొచ్చి వారికి పువ్వులు ఇచ్చాడు, వారిద్దరూ పూల వాసన చూసి మూర్ఛపోయారు. అంతలో అరతులం బంగారు, రూ.10 వేల నగదును తీసుకొని పరారయ్యాడు. ఈ విషయంపై టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరారెడ్డి తెలిపారు. నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్ తెలిపారు.
బంగారు, నగదు
అపహరించుకుని పరారీ
సింధనూరులో వ్యాపారిని
మోసగించిన వైనం


