రక్తదాతలు దయార్ద్ర హృదయులు | - | Sakshi
Sakshi News home page

రక్తదాతలు దయార్ద్ర హృదయులు

Apr 6 2026 7:54 AM | Updated on Apr 6 2026 7:54 AM

మైసూరు: రక్తదాతలు నిజంగా గొప్పవారని శ్రీరంగపట్నంలోని చంద్రవన్‌ ఆశ్రమం, బేబీ మఠాధిపతి త్రినేత్ర మహంత శివయోగి స్వామి అన్నారు. నగరంలోని జేకే మైదాన్‌ ఆడిటోరియంలో లయన్స్‌ బ్లడ్‌ సెంటర్‌ జీవధార, కేఎంపీకే చారిటబుల్‌ ట్రస్ట్‌, బ్లడ్‌ ఆన్‌ కాల్‌ క్లబ్‌ రక్తదాన జాగృతి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒక ప్రాణం నిలబడటానికి రక్తం ఎంతో ముఖ్యమన్నారు, అన్నదానాన్ని పొగిడినట్లే రక్తదానాన్ని కూడా అభినందించాలన్నారు. రక్తదాతలు నిజంగా దయార్ద్ర హృదయులన్నారు. సనాతన ధర్మానికి విశాల దృక్పథం ఉందన్నారు. ప్రపంచం పట్ల శ్రద్ధ చూపే దేశం ఏదైనా ఉంటే అది మనదే అని ఆయన అన్నారు. ఎమ్మెల్యే కె. హరీష్‌ గౌడ మాట్లాడుతూ, తాను 18 ఏళ్లలో అమ్మమ్మ కోసం తొలిసారిగా రక్తదానం చేశానని, ఆ తర్వాత కాలేజీ రోజుల్లో 35 సార్లకు పైగా రక్తదానం చేశానని చెప్పారు. డీసీపీ కె.ఎస్‌. సుందర్‌ రాజ్‌, టీవీ నటి మీనాక్షి, 310 సార్లు రక్తదానం చేసిన వి. భూపేంద్రన్‌, ఎస్‌. భాస్కర్‌రావు, కేపీసీసీ సభ్యుడు నటరాజ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement