డీహెచ్‌ఓ ఇంటిపై లోకాయుక్త మెరుపు దాడి | - | Sakshi
Sakshi News home page

డీహెచ్‌ఓ ఇంటిపై లోకాయుక్త మెరుపు దాడి

Dec 17 2025 7:05 AM | Updated on Dec 17 2025 7:05 AM

డీహెచ్‌ఓ ఇంటిపై లోకాయుక్త మెరుపు దాడి

డీహెచ్‌ఓ ఇంటిపై లోకాయుక్త మెరుపు దాడి

హొసపేటె: లోకాయుక్త అధికారులు తెల్లవారు జామునే అవినీతి అధికారి ఇంటి తలుపు తట్టారు. విజయనగర జిల్లా డీహెచ్‌ఓ శంకర్‌ నాయక్‌కు చెందిన ప్రైవేట్‌ ఆస్పత్రి, కార్యాలయం, ఇంటిపై లోకాయుక్త అధికారులు ఏకకాలంలో ముమ్మరంగా దాడులు నిర్వహించారు. విజయనగర లోకాయుక్త డీఎస్పీ సచిన్‌, పీఐ అమరేష్‌, రాజేష్‌ లమాణి, కొప్పళ, బళ్లారి లోకాయుక్త అధికారులు ఈ దాడులు నిర్వహించారు. లోకాయుక్త అధికారులు ఉదయం ఈ దాడులు నిర్వహించి పలు మహత్తరమైన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్రమ ఆస్తుల సంపాదన అద్భుతమైన మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుతో సహా డజన్ల కొద్దీ ఆస్తులను ఆయన సంపాదించారు. డాక్టర్‌ శంకర్‌ నాయక్‌ హయాంలో ఆరోగ్య శాఖలో నియామక ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అందువల్ల లోకాయుక్త అధికారులు ఈ దాడి చేసి దాఖలాలను పరిశీలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement