మంచి భర్త అనుకున్నా.. నరకం చూపారు | - | Sakshi
Sakshi News home page

మంచి భర్త అనుకున్నా.. నరకం చూపారు

Nov 27 2025 7:25 AM | Updated on Nov 27 2025 7:25 AM

మంచి

మంచి భర్త అనుకున్నా.. నరకం చూపారు

శివమొగ్గ: భర్త వేధింపులను తట్టుకోలేక భద్రా నీటి కాలువలోకి దూకిందో నవ వివాహిత. జిల్లాలో భద్రావతి తాలూకా సిద్ధాపుర వద్ద ఈ సంఘటన జరిగింది. తన బాధను హృదయవిదారకంగా డెత్‌నోట్‌లో రాసిపెట్టింది. వివరాలు... భద్రావతి తాలూకా డీబీ హళ్లికిచెందిన పరమేశ్వర, రుద్రమ్మ దంపతుల కుమార్తె లత (22). ఈ ఏడాది ఏప్రిల్‌లో శికారిపుర తాలూకా దిండదహళ్లి గ్రామానికి చెందిన గురురాజ్‌తో ఆమెకు పెద్దలు ఘనంగా పెళ్లిచేశారు. విద్యుత్‌ శాఖ (కేపీసీఎల్‌)లో గురురాజ్‌ ఏఈఈగా ఉద్యోగం చేస్తాడు. పెద్ద ఉద్యోగి దొరికాడు అని భార్య, అత్తమామలు సంతోషిస్తే, అది మూణ్నాళ్ల ముచ్చటే అయ్యింది. భర్త, అత్తమామల వేధింపులను తట్టుకోలేక బుధవారం కాలువ వద్దకు చేరుకుని మొబైల్‌ఫోన్‌ గట్టున పెట్టి దూకేసింది. ఆమె కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

డెత్‌నోట్‌ రాసి..

కాలువలోకి దూకిన నవ వివాహిత

శివమొగ్గ జిల్లాలో విషాదం

మంచి భర్త అనుకున్నా.. నరకం చూపారు1
1/1

మంచి భర్త అనుకున్నా.. నరకం చూపారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement