డెత్‌నోట్‌లో కన్నీటి వరద | - | Sakshi
Sakshi News home page

డెత్‌నోట్‌లో కన్నీటి వరద

Nov 27 2025 7:25 AM | Updated on Nov 27 2025 7:25 AM

డెత్‌నోట్‌లో కన్నీటి వరద

డెత్‌నోట్‌లో కన్నీటి వరద

మెట్టినింట్లో వేధింపుల గురించి లత డెత్‌నోట్‌లో వివరంగా రాసింది. నా చావుకు భర్త గురురాజ్‌, అత్త నాగరత్నమ్మ, బంధువులు రాజేశ్వరి, శారదమ్మ, కృష్ణప్ప కారణం. ఈ ఐదుగురు నన్ను మానసికంగా వేధించారు. మంచి వ్యక్తిని పెళ్లి చేసుకున్నా అని పొంగిపోయాను, కానీ అతడు తల్లిదండ్రుల మాటలు విని నాతో నాటకీయంగా ప్రవర్తించేవాడు. ఎన్నో అవమానాలు అనుభవించాను. ప్రతి మహిళ ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మంచి భర్త దొరకడు. ఎన్నో కలలతో అత్తింటిలోకి అడుగుపెట్టిన తర్వాత అక్కడ సర్దుకుపోవాలి. భార్యకు కనీసం భర్త అయినా మద్దతుగా ఉండాలి. ఇంట్లోని వారితో పాటు భర్త కూడా ద్వేషం చూపిస్తే ఆ మహిళకు చావుతో సమానం. రోజురోజుకీ చస్తూ బతకడం సాధ్యం కాదు. నా చావుకు న్యాయం చేయాలి అని చివరి కోరిక కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement