కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి

Jul 1 2025 4:24 AM | Updated on Jul 1 2025 4:24 AM

కళాకా

కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి

హొసపేటె: కళాకారుల జీవితాలను మెరుగుపరిచేందుకు మరిన్ని గ్రాంట్లను అందించాలి. కళాకారుల జీవితాలు చాలా కష్టంగా ఉన్నాయి. ప్రభుత్వం వారికి సహాయం చేయాలి. అప్పుడే కళాకారుల జీవితాలు మెరుగుపడతాయని పద్మశ్రీ అవార్డు గ్రహీత మాతా మంజమ్మ జోగతి తెలిపారు. ఆదివారం దుర్గాదాస్‌ కళామందిర్‌లో జరిగిన రంగబింబ 3వ వార్షికోత్సవం, సంగ్యా బాళ్యా నాటక ప్రదర్శన ప్రారంభోత్సవంలో ఆమె మాట్లాడారు. కన్నడ, సంస్కృతి శాఖ కళాకారుల జీవితాలను మెరుగు పరిచేందుకు మరిన్ని గ్రాంట్లను అందించాలన్నారు. పేద కళాకారులు, కళా సంస్థలకు సహాయం చేయడం ద్వారా రంగస్థల కళాకారులను ప్రోత్సహించాలన్నారు. అప్పుడే కళాకారులు, కళ మనుగడ సాగించగలరని ఆమె అన్నారు. ప్రస్తుతం రంగబింబ కళా ట్రస్ట్‌ గత మూడు సంవత్సరాలలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా కళా మనుగడ కోసం కృషి చేస్తోందని ఆయన అన్నారు. ఆర్యవైశ్య సమాజ్‌ అధ్యక్షుడు చిద్రి సతీష్‌, గుబ్బి వీరణ్ణ అవార్డు గ్రహీత, సీనియర్‌ నాటక కళాకారిణి డాక్టర్‌ నాగరత్నమ్మ, నాటక అకాడమి సభ్యుడు శివనాయక, పంచ గ్యారంటీ యోజన అమలు కమిటీ అధ్యక్షుడు కే.శివమూర్తి, పీపీ అధ్యక్షుడు ఆదిమని హుస్సేన్‌ బాషా, లలిత కళారంగ ఉపాధ్యక్షుడు జీఎం.కొట్రేష్‌, సభ్యుడు కే.మంజునాథ్‌, జీపీ మాజీ సభ్యుడు గోవింద పరశురామ, గరగ ప్రకాష్‌, ఎం.కీర్తిరాజ్‌ జైన్‌, రోగాని మంజునాథ్‌ పాల్గొన్నారు.

కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి1
1/1

కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement