
దైవ దర్శనానికి వచ్చి పరలోకానికి
● పుష్కరిణిలో పడి బాలుడు మృతి
శ్రీనివాసపురం: దైవ దర్శనానికి వచ్చిన కుటుంబంలో విషాదం పొంగిపొర్లింది. పుష్కరిణిలో మునిగి బాలుడు మరణించిన ఘటన ముళబాగిలు కురుడుమలై గ్రామంలో చోటు చేసుకుంది. చిత్రదుర్గ జిల్లా హొళల్కెరె తాలూకా కాలఘట్ట గ్రామానికి చెందిన కుశాల్ (9) మృతుడు. తండ్రి మంజునాథ్, కుమారుడు కుశాల్, కుటుంబంతో కలిసి ఆదివారం కురుడుమలై గ్రామంలోని పురాణ ప్రసిద్ధ వినాయక దేవాలయానికి దర్శనం కోసం వచ్చారు. అక్కడ ఆటలాడుకుంటూ పుష్కరిణి వద్దకు వెళ్లిన బాలుడు జారి నీటిలోకి పడిపోయాడు. కొంతసేపు ఎవరూ గమనించలేదు. కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. చివరికి పుష్కరిణిలో బాలుని శవం కనిపించింది. కుమారుడి మరణంతో దంపతులు ఇద్దరు కన్నీరు పర్యంతమయ్యారు. ముళబాగిలు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేశారు.

దైవ దర్శనానికి వచ్చి పరలోకానికి