
సాహిత్య సమ్మేళన అధ్యక్షురాలిగా బాను ముస్తాక్
బళ్లారిఅర్బన్: డిసెంబర్లో బళ్లారిలో జరగనున్న 88వ అఖిల భాతర సాహిత్య సమ్మేళనం అధ్యక్షురాలిగా బుకర్ ప్రైజ్ గెలుచుకున్న హార్ట్ ల్యాంప్ రచయిత, హాసన్కు చెందిన బాను ముస్తాక్ ఎంపికయ్యారు. కసాప రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ జోషి ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు. తొలిసారిగా కన్నడ రచయిత్రి బుకర్ ప్రైజ్ సాధించి ప్రపంచ వ్యాప్తంగా కన్నడ కస్తూరి పరిమాళలను ప్రసరింపజేశారన్నారు. దీంతో ఆమెను సమేళ్మన అధ్యక్షురాలిగా ఎంపిక చేయడం సమంజసమని కమిటీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి, ఇతర మంత్రుల సహకారంతో సమ్మేళనాన్ని వైభవోతంగా జరపడానికి కసాప ఇప్పటినుంచే ప్రక్రియ మొదలు బెట్టిందన్నారు. సమావేశంలో కసాప జిల్లాధ్యక్షుడు నిష్ట రుద్రప్ప, గౌరవ కార్యదర్శి డాక్టర్.హెచ్ఎల్ మల్లేశ్ గౌడ, తదితరులు పాల్గొన్నారు.