
పాత్రికేయుల సేవలు ప్రశంసనీయం
రాయచూరు రూరల్ : పాత్రికేయులు సమాజానికి అందిస్తున్న సేవలు ఆదర్శనీయమని ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీ విశ్వ విద్యాలయం సంచాలకురాలు స్మిత అన్నారు. ఆ సంస్థ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన అఖిల భారత పాత్రికేయుల దినోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పాత్రికేయుల తరహాలో సమాజానికి సేవ చేయాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు. పాత్రికేయులు నిష్పక్షపాతంగా కథనాలు రాయాలన్నారు. అనంతరం ఉత్తమ పాత్రికేయులకు అవార్డులు అందించారు. రామచంద్ర ప్రభు, చంద్రు, విజయ జాటగల్, వెంకట సింగ్, దండెప్ప బిరదార్ పాల్గొన్నారు.
ఎయిమ్స్ మంజూరుకు కమిటీ ఎందుకు?
రాయచూరు రూరల్: రాయచూరులో ఎయిమ్స్ మంజూరు కోసం కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర అహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి పేర్కొనడాన్ని బీఎస్పీ అధ్యక్షుడు జైబీమ్ తప్పు బట్టారు. అదివారం ఆయన నగరంలో విలేకరులతో మాట్లాడారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క రాయచూరు విషయంలోనే ఈ నిబంధన పెడుతున్నారన్నారు. ఏపీలోని మంగళగిరి, తెలంగాణ, బీబీనగర్, జమ్మూలో ఎయిమ్స్ ఏర్పాటుకు కమిటీలు ఏర్పాటు చేశారా? అని జైబీమ్ ప్రశ్నించారు. ఆ ప్రాంతాలకు లేని మార్గదర్శకాలు రాయచూరులో ఎయిమ్స్ మంజూరు విషయంలో ఎందుకు ప్రవేశపెట్టాల్సి వస్తోందని ప్రశ్నించారు.
గూడ్సుషెడ్ తరలింపునకు శ్రీకారం
రాయచూరు రూరల్: నగరంలోని రైల్వే గూడ్స్ షెడ్ను యరమరాస్కు తరలించేందుకు కేంద్ర దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు శ్రీకారం చుట్టారని రైల్వే బోర్డు మాజీ సభ్యుడు బాబారావ్ తెలిపారు. నగరంలో 60 ఏళ్లుగా ఉన్న రైల్వే గూడ్స్షెడ్తో ప్రమాదాలు చోటు చేసుకుంటుండటంతో నగరానికి 8 కి.మీ.దూరంలోని యరమరాస్కు తరలించడానికి చర్యలు తీసుకున్నారన్నారు.
బ్లడ్బ్యాంక్ను ప్రారంభించిన ఎంపీ
హొసపేటె: నగరంలో ఏర్పాటు చేసిన వై.ఉమామహేశ్వర రావు రోటరీ బ్లడ్ బ్యాంక్ సెంటర్ను ఎంపీ తుకారాం, ఎమ్మెల్యే గవియప్ప ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత పదేళ్లుగా రోటరీ క్లబ్ హోస్పేట్లో ఆరోగ్యం, విద్య, ఇతర సామాజిక సేవలు అందిస్తోందన్నారు. రోటరీ సంస్థ నేతలు తదితరులు పాల్గొన్నారు.
చెస్ పోటీలు మెదడుకు పదును
బళ్లారిఅర్బన్: ప్రతిభ పాఠవాల వెలికి తీతకు చెస్ పోటీలు దోహద పడుతాయని ట్రెడ్డి పేపర్ యజమాని సునిల్ గుండే విద్యార్థులకు సూచించారు. నగరంలోని గాంధీననగర్ వాటర్బూస్టర్ వద్ద ట్రెండి పేపర్ కాంప్లెక్స్లోబళ్లారి చెస్ అకాడమి ఆధ్వర్యంలో అండర్–15 బాలుర విభాగంలో ఆదివారం ఏర్పాటు చేసిన చెస్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాగా బళ్లారి, హోస్పేట్, బెంగళూరు, బీదర్, ఉడుపి, కుందాపుర, హైదారాబాద్, అనంతపురం, గుంతకల్లు ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. అకాడమి కోచ్ ఎస్ఎండీ రఫిక్, బసవేశ్వర డాక్టర్ భరత్, బళ్లారి చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు డీహెచ్ఎం విరుపాక్షయ్య, నాగరాజు, రాఘవేంద్ర, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

పాత్రికేయుల సేవలు ప్రశంసనీయం

పాత్రికేయుల సేవలు ప్రశంసనీయం

పాత్రికేయుల సేవలు ప్రశంసనీయం

పాత్రికేయుల సేవలు ప్రశంసనీయం