దేశంలో ఎమర్జెన్సీకి మించి దారుణ పరిస్థితులు | - | Sakshi
Sakshi News home page

దేశంలో ఎమర్జెన్సీకి మించి దారుణ పరిస్థితులు

Jun 30 2025 4:23 AM | Updated on Jun 30 2025 4:23 AM

దేశంలో ఎమర్జెన్సీకి మించి దారుణ పరిస్థితులు

దేశంలో ఎమర్జెన్సీకి మించి దారుణ పరిస్థితులు

హుబ్లీ: ఎమర్జెన్సీకిమించి దేశంలో దారుణ పరిస్థితులతో కూడిన వాతావరణం ఉందని, ఈ విషయం గురించి బీజేపీ నేతలు చర్చిస్తే మంచిదని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సంతోష్‌లాడ్‌ సూచించారు. ధార్వాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పహల్గాం, పూల్వామ దాడుల విషయాలను ప్రజలు మరచిపోయేలా 50 ఏళ్లనాటి ఎమర్జెన్సీ విషయాన్ని బీజేపీ ప్రచారం చేస్తోందన్నారు. ఎమర్జెన్సీ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించడం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. కాగా ఈ సారి మైసూర్‌ దసరా వేడుకలను కొత్త సీఎం ప్రారంభిస్తారన్న ఆర్‌ అశోక్‌ వ్యాఖ్యలపై సంతోష్‌లాడ్‌ మాట్లాడుతూ ఎవరు సీఎం అవుతారనేది ఆయన్నే అడగాలని పాత్రికేయులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement