
భద్ర, లింగనమక్కి కళకళ
శివమొగ్గ: గత కొన్నిరోజుల నుంచి పరివాహక వ్యాప్తిలో కురిసిన భారీ వర్షాలతో ప్రధాన జలాశయాలైన భద్రా, లింగనమక్కిల్లో నీటి నిల్వ భారీగా వృద్ధి చెందింది. జూన్ 28వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు అందిన సమాచారం మేరకు మధ్య కర్ణాటకలోని ప్రధాన జలాశయం భద్రా డ్యాం గరిష్ట నీటిమట్టం 186 అడుగులు కాగా 161.4 అడుగులకు చేరింది. 21 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. 1290 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గత ఏడాది ఇదే రోజుకు భద్రా డ్యాం నీటిమట్టం 122.3 అడుగులు మాత్రమే ఉండేది. జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం లింగనమక్కి డ్యాం గరిష్ట నీటిమట్టం 1819 అడుగుల కాగా, ఇప్పుడు 1784 అడుగులకు చేరింది. డ్యాంలోకి 24,752 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోండగా 7198 క్యూసెక్కుల నీటిని వదిలేస్తున్నారు. గత ఏడాది ఇదే రోజున నీటిమట్టం 1748 అడుగులు మాత్రమే ఉండేది. ఇక తుంగా డ్యాంకు 40,954 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. 41,151 క్యూసెక్కుల నీటిని వదలడంతో హొసపేటె టీబీ డ్యాంకు చేరుతోంది.
నిండుగా త్రివేణి సంగమం
మరోవైపు వర్షాలు తగ్గినా, మైసూరులో ఆకాశం దట్టంగా మేఘావృతమైంది. జిల్లాలో హుణసూరు వద్దనున్న లక్ష్మణతీర్థ నది ఉధృతంగా ఉంది. టి.నరసిపుర వద్ద కావేరి, కపిలా, స్ఫటిక సరోవర నదుల త్రివేణి సంగమం నిండుగా ప్రవహిస్తోంది.
నిండడానికి సిద్ధంగా డ్యామ్లు

భద్ర, లింగనమక్కి కళకళ

భద్ర, లింగనమక్కి కళకళ