
కృష్ణా తీరం.. వరద విలయం
రాయచూరు రూరల్: మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలు, నదీ పరివాహక ప్రాంతంలో విస్తారంగా కురుస్తున్న వానలతో కృష్ణా, దాని ఉప నదుల్లో వరద పోటెత్తుతోంది. వేద్ గంగా, పంచగంగా, దూద్ గంగా, హిరణ్యకేశి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆల్మట్టి డ్యాంలోకి 1.15 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఎగువ నుంచి వస్తోంది. ఈనేపథ్యంలో ఆల్మట్టి డ్యాంతో పాటు నారాయణపూర్ డ్యాం నుంచి 26 గేట్లను తెరిచి కృష్ణా నదికి లక్ష క్యూసెక్కుల నీరు వదిలారు. ఈనేపథ్యంలో ఉత్తర కర్ణాటకలోని బెళగావి, బాగల్ కోటె, విజయపుర, కళ్యాణ కర్ణాటకలోని కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాల్లోని 14 వంతెనలతో పాటు లోతట్టు ప్రాంతాల్లో వరద విలయం సృష్టించడంతో నీట మునిగాయి.
భీమా నదిలో ఇద్దరు గల్లంతు
మహారాష్ట్రలో కురుస్తున్న వానలతో పొంగి ప్రవహిస్తున్న భీమానదిలో ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన యాదగిరి జిల్లా వడగేర తాలూకా మాచనూరు వద్ద చోటు చేసుకుంది. గల్లంతైన యువకులను పశువుల కాపరులు సిద్దప్ప(21), రమేష్(17)లుగా పోలీసులు గుర్తించారు. గురుసుణిగి బ్రిడ్జి కం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉంది. నీటి ఉధృతికి మృతదేహాలు కొట్టుకుపోయి ఉంటాయని లేదా మొసళ్లు అధికంగా ఉన్నందున పీక్కు తిని ఉంటాయని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. అగ్నిమాపక దళం, రెవెన్యూ అధికారులు, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి మర పడవతో గాలింపు చేపట్టినట్లు వడగేర ఎస్ఐ మహబూబ్ అలీ, రెవెన్యూ అధికారి బసవరాజ్ తెలిపారు. యువకుల గల్లంతుతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ
అన్ని డ్యాంల నుంచి పరవళ్లు

కృష్ణా తీరం.. వరద విలయం

కృష్ణా తీరం.. వరద విలయం

కృష్ణా తీరం.. వరద విలయం

కృష్ణా తీరం.. వరద విలయం