
కరుణించని మేఘాలు.. కరువు కోరల్లో కర్షకులు
రాయచూరు రూరల్: ఖరీఫ్ సీజన్ ముగిసిపోతున్నా వరుణ దేవుడి కరుణ లేక రైతులు బిక్కముఖం వేసుకొని ఆకాశంలో మేఘాల వైపు చూస్తున్నారు. కల్యాణ కర్ణాటకలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. కళ్యాణ కర్ణాటక పరిధిలోని బీదర్, కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ జిల్లాల్లో సాగు, తాగునీటి పథకాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. జిల్లాలో ఖరీఫ్లో తొలకరి వానలు కురువక లక్షలాది హెక్టార్లలోని భూముల్లో రైతులు విత్తనాలు వేయక బీళ్లుగా మారాయి. నల్లరేగడి భూములు బీటలు బారి నోళ్లు తెరుచుకున్నాయి. రైతులు వర్షాలు కురుస్తాయన్న నమ్మకంతో ఎర్ర భూముల్లో ఎద్దులతో చదును చేస్తున్నారు. మేఘాలు కరుణించక రైతులు వర్షం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కరుణించని వరుణుడితో కర్షకుల కళ్లలో కన్నీరు మాత్రం తప్పడంలేదు.
వర్షం కురిపించని మేఘం
లక్షల హెక్టార్లలో పడని విత్తనం

కరుణించని మేఘాలు.. కరువు కోరల్లో కర్షకులు