అంగన్‌వాడీల్లో పోషణ్‌ ట్రాక్‌ను రద్దు చేయరూ | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల్లో పోషణ్‌ ట్రాక్‌ను రద్దు చేయరూ

Jun 29 2025 2:55 AM | Updated on Jun 29 2025 2:58 AM

రాయచూరు రూరల్‌: అంగన్‌వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహించే కార్యకర్తలకు తలనొిప్పిగా మారిన పోషణ్‌ ట్రాక్‌ పద్ధతిని రద్దు చేయాలని అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం డిమాండ్‌ చేసింది. మహిళా శిశు అభివృద్ధి, సంక్షేమ శాఖ జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకురాలు పద్మ మాట్లాడారు. పోషణ్‌ ట్రాక్‌ పద్ధతి ద్వారా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించడానికి మొబైల్‌ ఫోన్‌లో వారి ఫోటోలు తీసి అప్‌లోడ్‌ చేసి, కేవైసీ నంబర్‌తో పాటు ఆధార్‌ కార్డును లింక్‌ చేసి ఓటీపీ ద్వారా ఆహార పదార్థాలను పంపిణీ చేయాలని జారీ చేసిన ఆదేశాలను మరోసారి పరీశీలించాలని, నెట్‌ వర్క్‌ వున్న సమయంలో లబ్ధిదారులు రారని, వారు వచ్చినప్పుడు నెట్‌వర్క్‌ ఉండదని, ఆ పద్ధతిని రద్దు చేయాలని కోరుతూ జిల్లాధికారి కార్యాలయ అధికారికి వినతిపత్రం సమర్పించారు.

పచ్చదనం వృద్ధికి పెద్దపీట

రాయచూరు రూరల్‌: నగరంలో పచ్చని చెట్లు పెంచి పచ్చదనం పెంపొందించడానికి ప్రాధాన్యత ఇచ్చి పర్యావరణాన్ని సంరక్షించాలని అటవీ శాఖ అధికారి రాజేష్‌ నాయక్‌ పేర్కొన్నారు. శనివారం రాయచూరు తాలూకా హీరాపుర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా మొక్కలు నాటి మాట్లాడారు. భవిష్యత్తులో ప్రతి ఒక్క దాని నుంచి రక్షణ పొందాలంటే ప్రతి ఒక్కరు చెట్లు పెంచి పరిసరాలను సంరక్షించాలన్నారు. ఈసందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు గంగాధర్‌, మౌనేష్‌, సీహెచ్‌ లావణ్య, హఫీజుల్లా, శంకర్‌గౌడ, నరసింహ, ఆంజనేయ, ఈరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

వారసులకు

మొబైళ్ల అందజేత

రాయచూరు రూరల్‌: నగరంలో గత రెండు నెలల నుంచి మొబైళ్లను పోగొట్టుకున్న వ్యక్తుల విచారణ జరిపి చోరీ సోత్తును తిరిగి సొంతదారులకు అప్పగించిన ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం సదర్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో డీఎస్పీ శాంతవీర బాధితులకు మొబైల్‌ ఫోన్లను అప్పగించి విలేఖర్లతో మాట్లాడారు. సుమారు 25 మంది మొబైళ్లను పోగోట్టుకున్నారు. ఈ విషయంపై సదర్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైందని తెలిపారు. ఈ సందర్భంగా సీఐ ఉమేష్‌ నారాయణ కాంబ్లే, పోలీసులు శ్రీనివాస్‌, రవికుమార్‌, బసవరాజ్‌, శివానందలున్నారు.

సర్కారు బడుల్లో

ఆంగ్ల బోధన వద్దు

రాయచూరు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల భాషా బోధనను ప్రారంభించడానికి ఇచ్చిన అనుమతి రద్దు చేయాలని కన్నడ క్రియా సమితి అధ్యక్షుడు రఫీక్‌ పేర్కొన్నారు. శనివారం పాత్రికేయుల భవనంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటకలో మాతృభాష కన్నడకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆంగ్ల భాషను ప్రవేశ పెట్టి కన్నడ భాషకు తిలోదకాలివ్వటానికి సర్కారు కుట్ర పన్నిందని ఆరోపించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో మాత్రమే కన్నడ భాష ఉనికి మిగిలిందని, దానికి కూడా చరమగీతం పాడటానికి సర్కార్‌ కసరత్తు ప్రారంభించిందన్నారు. రాష్ట్రంలో ఆంగ్ల భాషకు ప్రాధాన్యత కల్పిస్తే కన్నడ భాష ఉనికికి ముప్పు ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పున పరిశీలించి ఆంగ్ల భాషకు బదులుగా కన్నడ భాషకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

మాలూరు: తాలూకాలోని చిక్కకంతూరు గ్రామ సంతె మైదానం వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని శనివారం స్థానికులు గమనించారు. వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి పరిశీలించారు. మృతుడి వయసు 30 నుంచి 35 సంవత్సరాల లోపు ఉంటుందని నిర్ధారించారు. కేసరి రంగు టీషర్టు, కాఫీ కలర్‌ ఫ్యాంట్‌ ధరించాడని, కుడిచేతికి కేసరి రంగు దారం ఉందని, ఇతని వివరాలు వారు మాలూరు పోలీస్‌ స్టేసన్‌లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు.

అంగన్‌వాడీల్లో పోషణ్‌ ట్రాక్‌ను రద్దు చేయరూ   1
1/3

అంగన్‌వాడీల్లో పోషణ్‌ ట్రాక్‌ను రద్దు చేయరూ

అంగన్‌వాడీల్లో పోషణ్‌ ట్రాక్‌ను రద్దు చేయరూ   2
2/3

అంగన్‌వాడీల్లో పోషణ్‌ ట్రాక్‌ను రద్దు చేయరూ

అంగన్‌వాడీల్లో పోషణ్‌ ట్రాక్‌ను రద్దు చేయరూ   3
3/3

అంగన్‌వాడీల్లో పోషణ్‌ ట్రాక్‌ను రద్దు చేయరూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement