
విద్యార్థులు కౌశల్యాలు పెంచుకోవాలి
కోలారు : విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు అందివ్వడం బెంగుళూరు ఉత్తర విశ్వ విద్యాలయ చరిత్రలోనే ఇదే తొలిసారి అని విశ్వ విద్యాలయ కులపతి ప్రొఫెసర్ నిరంజన వానళ్లి అన్నారు. నగర సమీపంలోని మంగసంద్ర స్నాతకోత్తర కేంద్రంలో శనివారం ఆయన 341 మంది విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించి మాట్లాడారు. ఉచిత ల్యాప్టాప్లను వినియోగించుకొని కౌశల్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. విశ్వ విద్యాలయ వ్యాప్తిలో చదువుతున్న 271 మంది విద్యార్థులకు ఉచిత కౌశల్య శిక్షణను అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాలనావిభాగం కులపతి సి.ఎన్.శ్రీధర్, సిండికేట్ సభ్యుడు వెంకటేశప్ప, డైరెక్టర్ డాక్టర్ కుముద పాల్గొన్నారు.