రూ.5 లక్షల విలువైన గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

రూ.5 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

Jun 29 2025 2:58 AM | Updated on Jun 29 2025 2:58 AM

రూ.5

రూ.5 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

హుబ్లీ: నైరుతి రైల్వే జోన్‌ పరిధిలో రైల్వే పోలీసులు, ఎకై ్సజ్‌ అధికారులు స్థానిక సిద్దారూఢ రైల్వేస్టేషన్‌లో కార్యాచరణ చేపట్టి రూ.5 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే స్టేషన్‌ ఫ్లాట్‌ఫాం–3లో అమరావతి ఎక్స్‌ప్రెస్‌ రైల్లో దొరికిన ఓ ఎర్ర సంచిని పరిశీలించగా అందులో 5.123 కేజీల గంజాయి ఉన్నట్లు తేలింది. సదరు గంజాయిని ఎకై ్సజ్‌ శాఖకు అప్పగించారు. ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదైంది.

బంగారు ఆభరణాలు చోరీ

కాగా మరో ఘటనలో తబీబా ల్యాండ్‌ ఫిష్‌ మార్కెట్‌ వద్ద ఉన్న ఇంట్లోకి చొరబడిన దొంగలు బంగారు ఆభరణాలు దోచుకొని పరారయ్యారు. ముబారక్‌ ఇంట్లో ఈ చోరీ జరిగింది. ఇంట్లో లాకర్‌లో పెట్టిన రూ.21,500 విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.12 వేల నగదు చోరీ అయింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపు తాళం పగలకొట్టి ఈ చోరీ చేసినట్లు బాధితుడు హుబ్లీ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తహసీల్దార్‌గా సంగీత

రాయచూరు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్న అధికారులను బదిలీ చేసింది. వీరిలో దేవదుర్గలో గ్రేడ్‌–2 తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న సంగీతను లింగసూగూరుకు బదిలీ చేశారు. లింగసూగూరు తహసీల్దార్‌గ విధులు నిర్వహిస్తున్న సయ్యద్‌ శాలంను రాయచూరు కార్పొరేషన్‌కు రెవిన్యూ శాఖ అధికారిగా నియమించారు. శుక్రవారం సంగీత లింగసూగూరు తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టారు.

పోస్టాఫీసులో

డెలివరి కేంద్రం ప్రారంభం

బళ్లారి టౌన్‌: నగరంలోని ప్రధాన పోస్టాఫీసు కార్యాలయం తొలి అంతస్తులో డెలివరి కేంద్రాన్ని శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ఈసందర్భంగా పోస్టాఫీసు కేంద్రం సూపరింటెండెంట్‌ పీ.చిదానంద మాట్లాడుతూ ఈ కేంద్రం వల్ల పోస్టు కార్డులను, ఇతర వస్తువులను త్వరితంగా ప్రజలకు అందజేయవచ్చన్నారు. ఈ సేవలు సాయంత్రం 4 నుంచి 7.30 గంటల వరకు త్వరితంగా పార్సిళ్లు అందచేసేందుకు ఎంతో ఉపయోగపడనుంది. దీన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈసందర్భంగా అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఎస్సీ వాలికర్‌, భీమసేన, రాజశేఖర్‌, తిందప్ప, నాగభూషణం, రాంప్రసాద్‌, చెన్నబసప్ప, రాఘవరెడ్డి, హనుమంతరెడ్డి, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

గ్రామాధికారి అరెస్టు

కెలమంగలం: వారసుదారు సర్టిఫికెట్‌ను అందజేసేందుకు రూ. 6 వేలు డిమాండ్‌ చేసిన గ్రామాధికారిని ఏసీబీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల మేరకు.. తాలూకా కేంద్రం అంచెట్టి మారెమ్మ ఆలయ వీధికి చెందిన మారియప్ప కొడుకు జయరామన్‌ (40). ఇతని తండ్రి గత 1999లో చనిపోయాడు. వారసుదారు సర్టిఫికెట్‌ కోసం గత 24వ తేదీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొన్నాడు. 27వ తేదీ శాలివారం గ్రామాధికారి ఆఫీసుకు వచ్చి సర్టిఫికెట్‌ గురించి అడిగాడు, గ్రామాధికారి లక్ష్మీకాంత్‌ రూ. 6 వేలు లంచం ఇవ్వాలని కోరడంతో రూ. 1500 అందజేసి ఇంటికెళ్లాడు. మరోవైపు ఏసీబీకి సమాచారం ఇచ్చాడు. మిగిలిన రూ.4500 శనివారం తీసుకుంటూ ఉండగా లక్ష్మీకాంత్‌ను అరెస్ట్‌ చేశారు.

విద్యా సామగ్రి అందజేత

శ్రీనివాసపురం : దేశాభివృద్ధిలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తాలూకా అధ్యక్షుడు ఎం భైరేగౌడ అన్నారు. తాలూకాలోని జోడి కృష్ణాపుర గ్రామ ప్రాథమిక పాఠశాలలో శనివారం ఆయన పాల్గొని విద్యార్థులకు ఉచిత బ్యాగులు, విద్యా సామగ్రి అందించి మాట్లాడారు. ఉపాధ్యాయులు తమ జీవితాన్ని సమాజ సేవకే అంకితం చేస్తానన్నారు. రఘునాథరెడ్డి, కాళాచారి, సభ్యుడు శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.

కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు

కోలారు : దాతలు ఇచ్చిన సహకారంతో కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి నసీర్‌ అహ్మద్‌ విద్యార్థులకు సూచించారు. టెన్త్‌, ఇంటర్‌లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు కోలారు యువ కాంగ్రెస్‌ సమితి అధ్యక్షుడు సయ్యద్‌ అఫ్రిది నేతృత్వంలో నగరంలోని టి చెన్నయ్య రంగమందిరంలో శనివారం ఉచితంగా ల్యాప్‌టాప్‌, 500 మంది విద్యార్థులకు ప్రశస్తి పత్రాలు అందించి మాట్లాడారు. దేశానికి ఐఏఎస్‌, ఐపీఎస్‌లను అధిక సంఖ్యలో పరిచయం చేసిన ఘనత కోలారు జిల్లాకు ఉందన్నారు. కార్యక్రమంలో కోలారు జిల్లా యువ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సయ్యద్‌ అఫ్రిది, కెఎండీసీ రాష్ట్ర డైరెక్టర్‌ అబ్దుల్‌ ఖయ్యూం పాల్గొన్నారు.

రూ.5 లక్షల విలువైన  గంజాయి స్వాధీనం 1
1/3

రూ.5 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

రూ.5 లక్షల విలువైన  గంజాయి స్వాధీనం 2
2/3

రూ.5 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

రూ.5 లక్షల విలువైన  గంజాయి స్వాధీనం 3
3/3

రూ.5 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement