
ముగ్గురు ఐపీఎస్ల సస్పెన్షన్కు కేంద్రం ఓకే
బనశంకరి: రాష్ట్రప్రభుత్వాన్ని తీవ్ర అప్రతిష్టపాలు చేసిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ జట్టు విజయోత్సవంలోతొక్కిసలాట జరిగి ప్రాణనష్టం జరిగిన సంఘటనలో అప్పటి పోలీస్ కమిషనర్ బీ.దయానంద్, మరో ఇద్దరు ఐపీఎస్లను సర్కారు సస్పెండ్ చేయడం తెలిసిందే. వారి సస్పెన్షన్ను కేంద్రహోం శాఖ ఆమోదించింది. బీ.దయానంద్, అదనపు పోలీస్ కమిషనర్ వికాస్కుమార్, బెంగళూరు సెంట్రల్ డీసీపీ శేఖర్లను సస్పెండ్చేసి ఆ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఐఏఎస్, ఐపీఎస్లపై చర్యలు తీసుకుంటే నిబంధనల ప్రకారం కేంద్ర సిబ్బంది నిర్వహణ మంత్రిత్వశాఖకు, హోంశాఖకు సమాచారమివ్వాలి. సస్పెన్షన్ విషయంలో కేంద్ర ప్రభుత్వమే అంతిమ నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వ ఆదేశాలకు కేంద్రం ఆమోదం తెలిపింది.
విచారణకు హాజరు
శివాజీనగర: తొక్కిసలాట కేసులో రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ న్యాయమూర్తి మైకేల్ డి కున్హాతో విచారణ జరిపిస్తోంది. ఆయన ముందుకు ముగ్గురు ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు. శనివారం కుమారకృప గెస్ట్ హౌస్లో విచారణ సాగింది. దయానంద, హెచ్.టీ.శేఖర్, వికాస్కుమార్ వికాస్ హాజరై వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది. ఆ రోజు బందోబస్తుతో పాటు పలు అంశాల మీద జడ్జి మైకేల్ సమాచారం సేకరించారు.

ముగ్గురు ఐపీఎస్ల సస్పెన్షన్కు కేంద్రం ఓకే