
పోరాట యోధులను బెదిరించడం తగదు
రాయచూరు రూరల్: రాయచూరు ఎయిమ్స్ పోరాట సమితి సంచాలకులను, ఆందోళనకారులను శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ బెదిరించడాన్ని రాయచూరు ఎయిమ్స్ పోరాట సమితి సంచాలకులు తప్పు బట్టారు. శుక్రవారం పోరాట వేదిక వద్ద ఆందోళన చేపట్టి మాట్లాడారు. కర్ణాటకలోని రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటులో శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ ఎయిమ్స్ పోరాట సమితి అధ్యక్షుడు బసవరాజ్ కళస, అశోక్ కుమార్ జైన్లను అసభ్య పదజాలాలతో నిందించాడని, అలాంటి వ్యక్తిపై చర్యలు చేపట్టాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.