ఆల్మట్టి నుంచి కృష్ణమ్మ పరవళ్లు | - | Sakshi
Sakshi News home page

ఆల్మట్టి నుంచి కృష్ణమ్మ పరవళ్లు

Jun 28 2025 6:05 AM | Updated on Jun 28 2025 6:05 AM

ఆల్మట్టి నుంచి కృష్ణమ్మ పరవళ్లు

ఆల్మట్టి నుంచి కృష్ణమ్మ పరవళ్లు

రాయచూరు రూరల్‌: మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలు, కృష్ణాతో పాటు దాని ఉప నదుల పరివాహక ప్రాంతంలో వానలు కురుస్తుండడంతో కృష్ణమ్మకు వరద పోటెత్తుతోంది. కృష్ణా నదీ పరివాహకంలోని వేద గంగా, పంచగంగా, దూద్‌ గంగా, హిరణ్యకేశి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బంగాలి బాబా మందిర్‌ జల దిగ్బంధం అయింది. బెళగావి జిల్లా చిక్కోడి డివిజన్‌లో కల్లోళ, యడూర, మలికవాడ, దత్తవాడ, నిప్పాణి తాలూకాలో బారవాడ, కున్నూర, కారదగ, బోజ వంతెనలు జలావృతం అయ్యాయి. ఆల్మట్టి డ్యాం నుంచి కృష్ణా నదికి 14 గేట్లను తెరిచి 1,08,250 క్యూసెక్కుల నీటిని వదిలారు. దీంతో శిశిలేశ్వర దేవాలయం నీటిలో మునిగింది. 8 వంతెనలు పూర్తిగా నీట మునిగాయి. ప్రజలు నది తీరానికి వెళ్లకుండా పోలీసులు అక్కడకక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. బెళగావి జిల్లాలో బెణ్ణెతుప్రి వాగు కూడా ఉరకలెత్తుతోంది.

నదికి 1.08 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల

వరద నీట మునిగిన నదీ తీరంలోని ఆలయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement