
భక్తులతో చాముండి కొండ కిటకిట
ఉచిత టికెట్ ప్రకటన వల్లే తొక్కిసలాట
● సస్పెండైన బెంగళూరు కమిషనర్
దయానంద్ వెల్లడి
శివాజీనగర: తొలిసారిగా ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ చేపట్టిన నేపథ్యంలో గత జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి క్రీడా మైదానంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఆర్సీబీ అభిమానులు వచ్చినపుడు తొక్కిసలాట సంభవించి 11 మంది మృతి చెందారు. కేసుకు సంబంధించి బెంగళూరు కమిషనర్ బీ.దయానంద్తో పాటు పలువురు అధికారులను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం సస్పెండ్ అయిన బెంగళూరు కమిషనర్ బీ.దయానంద్ విచారణకు హాజరైనపుడు ఉచిత టికెట్ ప్రకటించటంతో చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగిందని తెలిపారు. మేజిస్ట్రేట్ ముందు గురువారం విచారణకు హాజరైన దయానంద్ ఆరోజు జరిగిన ఘటనను పూర్తిగా వివరించారు. ఘటన జరిగిన రోజు 21 గేట్లను కూడా తానే నేరుగా భేటీ చేశాను. పూర్తి బందోబస్త్ ఏర్పాటు చేశాం. ప్రతిసారి ఐపీఎల్ మ్యాచ్ జరిగేటపుడు ఉన్నంత బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు. అయితే ఆరోజు గేట్ తెరవటానికి ఆలస్యం చేశారు. ఉచిత టికెట్ ప్రకటించటంతో ఇలాంటి ప్రమాదం నెలకొందని సాక్ష్యాలు వెల్లడించారు. ఆర్సీబీ విజయోత్సవ సమయంలో తొక్కిసలాటకు బలైన 11 మంది మరణం తనిఖీ తుది దశకు వచ్చింది. శుక్రవారం రోజంతా విచారణ జరిగింది. తనిఖీ ఆఖరి భాగంలో ప్రజలు పాల్గొననున్నారు. తొక్కిసలాటకు సంబంధించి ఇప్పటి వరకు 140 మంది సాక్షులు తమ వాంగ్మూలాన్ని తెలియజేయగా, వచ్చే వారం ప్రభుత్వానికి తనిఖీ నివేదిక సమర్పించే అవకాశముందని ఉన్నత వర్గాల ద్వారా తెలియవచ్చింది.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పు లేదు
● ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ స్పష్టీకరణ
శివాజీనగర: బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా కొత్తవారిని నియమిస్తారని కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా ఇటు రెబల్ నాయకులు వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష నాయకుడు ఆర్.అశోక్ ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ను భేటీ చేశారని తెలిసింది. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పు గురించి అధిష్టానం వద్ద ఎలాంటి చర్చ జరగలేదన్నారు. రాష్ట్రాధ్యక్షుడి మార్పుపై మీడియాలో మాత్రమే కథనాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఏమైనా కేంద్ర నాయకుల నిర్ణయమే అంతిమమన్నారు. కేవలం కర్ణాటక మాత్రమే కాదు, దేశంలో అన్ని రాష్ట్రాల అధ్యక్షుల నియామకం జరుగుతోందన్నారు. విజయేంద్రకు విరుద్ధంగా ఫిర్యాదు చేసేందుకు ఎలాంటి అవకాశం లేదన్నారు. మూడు నెలలకు ఒకసారి వచ్చి నివేదిక ఇవ్వాలని అధిష్టానం సూచించినట్లు తెలిపారు. తాను అంతమాత్రమే చేస్తానని, మిగతా విషయాలు తెలియవని అన్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఏరో నాటికల్ ఇంజినీర్ మృతి
దొడ్డబళ్లాపురం: స్కూటర్ను ఫార్చూనర్ కారు ఢీకొని ఏరోనాటికల్ ఇంజినీర్ మృతిచెందిన ఘటన బెంగళూరులోని బాగలూరు రోడ్డులోని కేఐఏడీబీ జంక్షన్లో చోటుచేసుకుంది. బెంగళూరు సమీపంలోని నెలమంగల తాలూకా హుస్కూరు గ్రామానికి చెందిన నందిని(24) బాగలూరులోని పీజీలో ఉంటూ ఏరోనాటికల్ ఇంజినీర్గా పని చేస్తోంది. గురువారం రాత్రి పని ముగించుకుని తన స్కూటర్లో పీజీకి తిరిగి వస్తుండగా కేఐఏడీబీ జంక్షన్లో వేగంగా వచ్చిన కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ నందినిని ఆస్పత్రికి తరలిస్తుండగా దారి మధ్యలోనే మృతిచెందింది. చిక్కజాల ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
బనశంకరి: వాయు కాలుష్యంలో ఢిల్లీ తర్వాత చోటు దక్కించుకున్న సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలో ఊపిరి తీసుకోవాలంటే కష్టమే. లక్షలాది వాహనాల సంచారంతో నిత్యం టన్నుల కొద్దీ కాలుష్యం గాలిలో కలుస్తోంది. దీంతో స్వచ్ఛమైన ప్రాణవాయువు కోసం ప్రజలు తపించి పోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో బెంగళూరు నగరంలో హెచ్చుమీరుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు ఆక్సిజన్ ఉత్పత్తి చేసే చెట్లు పెంచి పోషించాలని పర్యావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. బీబీఎంపీ కూడా ప్రాణవాయువును ఎక్కువ విడుదల చేసే మొక్కలతో ట్రీపార్కుల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది.
నగరంలో వందలాదిగా ఉద్యానవనాలు
వాస్తవంగా బెంగళూరు నగరం వందలాది ఉద్యానవనాలతో అలరారుతోంది. లక్షలాది చెట్లు నగరవాసులకు ప్రాణవాయువు అందిస్తున్నాయి. దేశంలోనే అత్యధికంగా ఉద్యానవనాలు కలిగిన నగరంగా బెంగళూరు ఖ్యాతి పొందింది. కొన్ని దశాబ్దాలుగా బెంగళూరు నగరం కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. సంఖ్యాపరంగా ఉద్యాన నగరిగా చెబుతున్నప్పటికీ ఈ పార్కులనుంచి కాలుష్య ప్రమాణం తగ్గించడం సాధ్యం కాలేదు. అలంకరణచెట్లు, కుజ్జ మొక్కలను పెంచడానికి ఇచ్చే ప్రాధాన్యత దేశీయ వృక్షజాతులైన ఎక్కువ ప్రాణవాయువు విడుదల చేసే అల్లనేరేడు, వేప, అర్జున, శ్రీగంధ, వెదురు, రావి తదితర చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
ట్రీ పార్కులకు ప్రాధాన్యత ఇవ్వాలి
ప్రస్తుతం పాలికె పరిధిలో ఏటా పార్కులను అబివృద్ధి చేస్తుండగా వీటి నిర్వహణకు ఏడాదికి రూ.100 కోట్లు ఖర్చు అవుతోంది. స్థలం సమస్యతో కొత్త ఉద్యానవనాల విస్తీర్ణం తగ్గుతోంది. ఒకపార్కు అభివృద్ధి చేయడానికి రూ.3 నుంచి 4 కోట్లు ఖర్చు అవుతోంది. కొన్ని పార్కులకు రూ.5 కోట్లుకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. పార్కుల సుందరీకరణ పేరుతో లాన్, అలంకరణమొక్కలు, గ్రానైట్రాతి బెంచీలు, వాకింగ్ ట్రాక్కు నిధులు వ్యయం చేస్తున్నారు. వీటికి బదులు చెట్లను పెంచడానికి ప్రాధాన్యత ఇవ్వడంలేదు. ఉద్యానవనాల పేరుతో ప్రభుత్వ ధనాన్ని కాంట్రాక్టర్ల పాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దశాబ్దాల క్రితం ట్రీపార్కు తరహాలో పాలికె ఏర్పాటు చేసినప్పటికీ దానిని పూర్తిగా అమల్లోకి తీసుకురావడంలో సఫలీకృతం కాలేదు.
వందేభారత్ రైలులో మంటలు
సాక్షి,బళ్లారి: వందేభారత్ రైలులో మంటలు చెలరేగాయి. అయితే తృటిలో పెనుప్రమాదం తప్పింది. శుక్రవారం ధార్వాడ నుంచి బెంగళూరు వెళ్తుండగా దావణగెరె జిల్లాలోకి రాగానే బోగీల్లోని చక్రాల్లో మంటలు చెలరేగాయి. వెంటనే గుర్తించిన రైల్వే శాఖ అధికారులు రైలును ఆపేశారు. ప్రయాణికులను వేరే రైలు ద్వారా బెంగళూరుకు పంపించారు.
మైసూరు : ఆషాఢ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా మైసూరు నగరంలో చాముండి కొండ పైన వెలసిన నాడ శక్తి దేవత చాముండేశ్వరి అమ్మవారు భక్తులకు లక్ష్మీదేవి అమ్మవారి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆషాఢ మాసం మొదటి శుక్రవారం కావడంతో చాముండేశ్వరి దేవి దర్శనానికి కర్ణాటక నుంచి మాత్రమే కాకుండా చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చారు. తెల్లవారుజామునే చాముండేశ్వరి అమ్మవారి అలయాన్ని వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు. అమ్మవారిని సైతం వివిధ రకాల రంగుల పూలతో అలంకరించారు. మూల విరాట్తోపాటు ఉత్సవమూర్తిని సైతం అలంకరించారు. తెల్లవారు జామునుంచే భక్తులు క్యూలో నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు లలిత మహల్ మైదానం నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించారు. నటి శృతి, మాళవికా అవినాష్ తదితర నటులు అమ్మవారిని దర్శించుకున్నారు. మైసూరు జిల్లాధికారి లక్ష్మీకాంత్రెడ్డి, మాజీ మంత్రి హెచ్.డీ.రేవణ్ణ, ఎమ్మెల్యే జీ.టీ.దేవెగౌడ అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన ముత్తైదువులకు శ్రీదుర్గా పరమేశ్వరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పసుపు, కుంకుమ, గాజులు వాయనంగా అందజేశారు. అధ్యక్షురాలు రేఖా శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఉద్యాననగరిలో వాయుకాలుష్య
నియంత్రణకు ట్రీ పార్కులు
వేప, అర్జున, శ్రీగంధ, వెదురు,
రావి మొక్కల పెంపకానికి ప్రాధాన్యత
కసరత్తు చేస్తున్న బీబీఎంపీ
ఉద్యానవన విభాగం
లక్ష్మీదేవిగా భక్తులకు
చాముండేశ్వరి దేవి దర్శనం
నాడ శక్తి దేవత దర్శనానికి
తరలివచ్చిన భక్తులు
ట్రీపార్కులపై దృష్టి
బీబీఎంపీలో ట్రీపార్కులను అభివృద్ధి చేయడంపై దృష్టిసారించాం. ఇప్పటికే అభివృద్ధి చేసిన ఉద్యానవనాల్లో ఆక్సిజన్ను ఎక్కువగా ఉత్పత్తి చేసే వివిధ జాతుల మొక్కలు నాటాం. కొత్తపార్కుల్లో కూడా ఇదే విధానాన్ని అమలుపరుస్తున్నాం. దేశీయ జాతుల మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ ఏడాది 50 పార్కులను అభివృద్ధి చేయాలని పథకం రూపొందించాం
–ఎంఆర్.చంద్రశేఖర్, బీబీఎంపీ ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్
అప్పట్లో మొత్తం పచ్చదనమే
‘గతంలో మేము బెంగళూరుకు వచ్చినప్పుడు ఎక్కడచూసినా భారీ వృక్షాలు, కూడళ్లలో వాటర్ ఫౌంటేన్లు కనిపించేవి. బెంగళూరు నగరం శరవేగంగా విస్తరించడంతో కాలుష్యం కూడా పెరుగుతోంది. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని పచ్చదనం పెంచడంతో పాటు ఆక్సిజన్ లభించే మొక్కలు నాటి పోషించాలి’ అని కేఎస్పీసీబీ అధ్యక్షుడు పీఎం.నరేంద్రస్వామి అన్నారు.

భక్తులతో చాముండి కొండ కిటకిట

భక్తులతో చాముండి కొండ కిటకిట

భక్తులతో చాముండి కొండ కిటకిట

భక్తులతో చాముండి కొండ కిటకిట

భక్తులతో చాముండి కొండ కిటకిట

భక్తులతో చాముండి కొండ కిటకిట

భక్తులతో చాముండి కొండ కిటకిట

భక్తులతో చాముండి కొండ కిటకిట