
ఎయిమ్స్ కోసం హైకోర్టులో పిటిషన్ వేస్తాం
రాయచూరు రూరల్: రాయచూరుకు ఎయిమ్స్ కోసం పోరాటం పేరుతో శాంతికి భంగం వాటిల్లకుండా బహిరంగ పోరాటానికి కోర్టు మెట్లెక్కాలని యోచిస్తున్నట్లు అంబేడ్కర్ వేదిక సంచాలకుడు మహేంద్ర వర్మ తెలిపారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటులో శాసన సభ్యుడు, ఆందోళనకారుల మధ్య అసభ్య పదజాలాలతో దూషిస్తూ దారి తప్పిస్తున్న విషయంలో ఆందోళనకారులకు మరో అవకాశముందన్నారు. న్యాయస్థానంలో రాయచూరుకు ఎయిమ్స్ కావాలని రిట్ పిటిషన్ వేస్తు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆరోగ్య శాఖ కమిషనర్లకు నోటీసులు పంపే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో ఉత్తర్ ప్రదేశ్లోని ప్రయాగరాజ్ జిల్లాలో ఎయిమ్స్ కోసం సహజ సారథి ఫౌండేషన్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయాన్ని గుర్తు చేశారు.