శాసీ్త్రయ సాగుపై ఆసక్తి అవసరం | - | Sakshi
Sakshi News home page

శాసీ్త్రయ సాగుపై ఆసక్తి అవసరం

Jun 14 2025 9:54 AM | Updated on Jun 14 2025 9:54 AM

శాసీ్

శాసీ్త్రయ సాగుపై ఆసక్తి అవసరం

బళ్లారిటౌన: రైతులు మట్టి సారవంతం ఆధారంగా శాసీ్త్రయ పంటల సాగు పద్ధతిని అనుసరించి ఎక్కువ దిగుబడి సాధించాలని జిల్లాధికారి ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో రైతుల మేళాను ప్రారంభించి మాట్లాడారు. నేటి ఆధునిక యుగంలో అధిక దిగుబడులు వచ్చే పంటలను సాగు చేయాలని సూచించారు. జిల్లా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు యశ్వంత్‌రాజ్‌ నాగిరెడ్డి మాట్లాడుతూ రైతులు దేశానికి వెన్నెముక అని, ప్రతి ఒక్కరూ రైతులను గౌరవించాలన్నారు. తమ సంస్థ రైతు సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. వ్యవసాయ శాఖ జేడీ సోమసుందర్‌, ఉద్యానవన శాఖ డీడీ సంతోష్‌, జిల్లా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రముఖులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీకి అమాత్య పదవి వద్దు

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో రాయచూరు ఎమ్మెల్సీ వసంత్‌ కుమార్‌కు అమాత్య పదవిని కేటాయించ వద్దని హైకోర్టు న్యాయవాది నరసప్ప సూచించారు. శుక్రవారం పాత్రికేయుల భనవంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ మాదిగ సముదాయం వారు కాదు, క్రైస్తవ మతానికి చెందిన వారని, వారి తల్లి మేరీ అని తెలిపారు. ఎమ్మెల్సీ క్రిష్టియన్‌ను వివాహం చేసుకున్న దాఖలాలను ప్రదర్శించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర మంత్రి ప్రియాంక్‌ ఖర్గే ఆయనకు మద్దతు ఇవ్వకుండా మాదిగ సముదాయానికి చెందిన వారికి మంత్రి పదవిని కేటాయించాలన్నారు. క్రిస్టియ్‌న్‌ మతాన్ని స్వీకరించిన వసంత్‌ కుమార్‌కు మంత్రి వర్గంలో చోటు ఇవ్వరాదని అన్నారు.

నేడు వక్ఫ్‌ బోర్డు

అధ్యక్షుడికి సన్మానం

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో నూతనంగా నియమితులైన వక్ఫ్‌ బోర్డు అధ్యక్షుడికి మైనార్టీలతో సన్మానం చేయనున్నట్లు మైనార్టీ సెల్‌ సంచాలకుడు శాలం వెల్లడించారు. శుక్రవారం పాత్రికేయుల భనవంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం రాత్రి రాయచూరులోని మహిళా సమాజ్‌లో రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు అధ్యక్షుడు సయ్యద్‌ షా అలీ అల్‌ హుసేనీకి అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమానికి క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ అజరుద్దీన్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి ధర్మ గురువులు హాజరవుతారన్నారు. కార్యక్రమంలో మంత్రులు శరణ ప్రకాష్‌ పాటిల్‌, బోసురాజు, ఎంపీ కుమార నాయక్‌, ఎమ్మెల్యేలు హంపయ్య నాయక్‌, బసనగౌడ, హంపన గౌడ, బసనగౌడ, శరణే గౌడ, చంద్రశేఖర్‌, ఎమ్మెల్సీ వసంత్‌ కుమార్‌ పాల్గొంటారన్నారు.

అభివృద్ధి పనులకు

ఎమ్మెల్యే శ్రీకారం

బళ్లారి అర్బన్‌: ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి శుక్రవారం హవంబావి తదితర చోట్ల వివిధ అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. 36వ వార్డు పరిధిలోని హవంబావి గోవిందయ్య ఇంటి నుంచి రామనగర్‌ 3వ క్రాస్‌ వరకు రూ.71.75 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణాలకు భూమిపూజను నెరవేర్చారు. తిప్పయ్య ఇంటి వద్ద నుంచి వెంకట్రావ్‌ ఇంటి వరకు, హనుమయ్య ఇంటి నుంచి మెయిన్‌ రోడ్డు వరకు, రమేష్‌ ఇంటి నుంచి ఓబణ్ణ ఇంటి వరకు, మారెన్న ఇంటి నుంచి ఆంటీ హోటల్‌ వరకు రూ.1.72 కోట్ల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కేకేఆర్‌డీబీ నిధులతో రూ.3.29 కోట్ల వ్యయంతో రెండు, మూడవ క్రాస్‌ రోడ్లను కలిపే రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజను నిర్వహించారు. ఈసందర్భంగా కార్పొరేటర్‌ మించు శ్రీనివాసులు, ఆ వార్డు ప్రముఖులు లోకేష్‌, బత్రీ వాసు, మంగళ రామాంజనేయ, యశోద, హగరి గోవిందు, హొన్నప్ప, బీఆర్‌ఎల్‌ శీన, భాస్కర్‌రావు, ఉమామహేశ్వర్‌రావు, చంద్రశేఖర్‌, చిరంజీవి, రావి రమేష్‌, సుబ్బారావు, జానకీరాం, గంగాధర్‌, పిచ్చేశ్వర్‌రావు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

శాసీ్త్రయ సాగుపై  ఆసక్తి అవసరం1
1/3

శాసీ్త్రయ సాగుపై ఆసక్తి అవసరం

శాసీ్త్రయ సాగుపై  ఆసక్తి అవసరం2
2/3

శాసీ్త్రయ సాగుపై ఆసక్తి అవసరం

శాసీ్త్రయ సాగుపై  ఆసక్తి అవసరం3
3/3

శాసీ్త్రయ సాగుపై ఆసక్తి అవసరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement