
భక్తిశ్రద్ధలతో శ్రీనివాస మండల పూజ
మాలూరు : పట్టణంలోని శ్రీధర్మరాయ స్వామి ఆలయ సమీపంలో నిర్మించిన శ్రీనివాస దేవర 6.5 అడుగుల ఎత్తైన నూతన బింబ ప్రతిష్టాపన, కుంభాభిషేకం, 48వ సంవత్సర మండల పూజా కార్యక్రమాన్ని శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీనివాస ఆలయ ఛారిటబుల్ ట్రస్టు భైరాగి మఠం ఆధ్వర్యంలో 6.5 అడుగుల ఎత్తు కలిగిన శ్రీనివాస మూర్తిని ప్రతిష్టించి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్ నేతృత్వంలో గోపూజ, యాగశాల ప్రవేశం, స్వస్తివచనం, అంకురార్పణ, శ్రీమహాగణపతి పూజ తదితరాలను నిర్వహించారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు.