
కొడుక్కి కత్తిపోట్లు, తల్లికి గుండెపోటు
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం తాలూకా పెరేసంద్ర పోలీస్ పరిధిలోని కోరరేనహళ్లి గ్రామంలో భూ వివాదంలో శివణ్ణ అనే వ్యక్తి నవీన్ను కత్తితో పొడిచాడు. ఈ రభసలో నవీన్ తల్లి మరణించింది. బుధవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. నవీన్ పాల డెయిరీకి పాలను తీసుకొని వెళుతున్న సమయంలో శివణ్ణ వెనుక నుంచి వచ్చి దాడి చేశాడు. నవీన్ గాయపడి పారిపోయి ఇంటిలో దాక్కొన్నాడు, అతని తల్లి యశోదమ్మ (58) కొడుకును కాపాడబోగా, ఆమె చిన్న కత్తిగాయమైంది. వెంటనే గుండెపోటుతో కుప్పకూలిపోయింది. గ్రామస్తులు ఇద్దరినీ చిక్కబళ్లాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా యశోదమ్మ మరణించింది. నవీన్కు ప్రథమ చికిత్స చేసి బెంగళూరుకు తరలించారు. నిందితుడు శివణ్ణ తప్పించుకొని పారిపోయాడు. పెరేసంద్ర పోలీసులు గాలిస్తున్నారు. గ్రామంలో గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటైంది.
ఆస్పత్రిలో మరణించిన మహిళ
చిక్కబళ్లాపుర వద్ద విషాదం

కొడుక్కి కత్తిపోట్లు, తల్లికి గుండెపోటు