
అమోఘం.. ముంగారు కళా వైభవం
రాయచూరు రూరల్: మున్నూరు కాపు సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముంగారు ఉత్సవాల్లో భాగంగా కళా వైభవం ప్రజలను ఆకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పంజాబ్ల నుంచి వచ్చిన కళా బృందాలు ప్రదర్శనలు చేశాయి. మున్నూరు కాపు సమాజం కుల దేవత మాతా మహాలక్ష్మి దేవిని, కాశీ జ్ఞాన సింహాసనాధీశ్వర పీఠాధిపతి జగద్గురు డాక్టర్ మల్లికార్జున విశ్వారాధ్య శివాచార్య భగవత్పాదులను ఊరేగించారు. తోలుబొమ్మలాట నృత్యం, మహిళలతో డోలు కుణిత, డప్పు వాయిస్తున్న కళాకారులు ఊరేగింపులో పాల్గొన్నారు.
ఆకట్టుకున్న రాతి దూలం లాగే పోటీలు
ముంగారు ఉత్సవాలు రైతులను సంబర పరిచి వారిలో ఉత్సాహాన్ని నింపుతాయని మాజీ శాసన సభ్యుడు పాపారెడ్డి అన్నారు. గురువారం ఏపీఎంసీ ఆవరణలో మున్నూరు కాపు సమాజం ముంగారు ఉత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎద్దులకు రెండున్నర టన్నుల బరువైన రాతి దూలం లాగే పోటీలను మహిళలతో కలిసి ప్రారంభించి ఆయన మాట్లాడారు. మున్నూరు కాపు ససమాజం ఐకమత్యంతో పోటీలు నిర్వహించడం హర్షణీయం అన్నారు. రైతుల జీవనాడి బసవణ్ణకు పూజలు చేయడం, ఊరేగించడం ఆనవాయితీ అన్నారు. మున్నూరు కాపు సమాజం అధ్యక్షుడు నరసారెడ్డి, తిమ్మారెడ్డి, శేఖర్రెడ్డి, శ్రీనివాసరెడ్డిలున్నారు.
కళా బృందాల ప్రదర్శనలు అదుర్స్
ఊరేగింపులో పాల్గొన్న జగద్గురువులు

అమోఘం.. ముంగారు కళా వైభవం

అమోఘం.. ముంగారు కళా వైభవం

అమోఘం.. ముంగారు కళా వైభవం