
పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరం
సాక్షి,బళ్లారి: ప్రతి ఒక్కరు తమ పిల్లలను చదివించాలని, బాలకార్మికులను పనిలో చేర్పించి వారిచే సంపాదన చేయించరాదని, చదువుతోనే అభివృద్ధి సాధ్యమని జిల్లా న్యాయమూర్తి రాజేష్ హొసమనె పేర్కొన్నారు. ఆయన గురువారం ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దేశంలో బాలకార్మిక పద్ధతికి ప్రత్యేక చట్టాలు చేసినా నేటికీ పేదరికం తాండవిస్తోందన్నారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల కోట్లాది మంది బాలకార్మికులుగా పని చేస్తుండటం శోచనీయం అన్నారు. భావిభారత పౌరులుగా ఎదగాల్సిన చిన్నారులతో పనులు చేయించుకోవడం నేరం అన్నారు. చదువు ద్వారానే అభివృద్ధి సాధ్యమన్నారు. చదువుకునే వయస్సులో పనులు చేయించకూడదన్నారు. బాలకార్మిక పద్ధతిని రూపుమాపేందుకు కేవలం ప్రభుత్వాలు ఒకటే కృషి చేస్తే చాలదన్నారు. అధికారులు, బాలల తల్లిదండ్రుల సహకారం పూర్తిగా అవసరం అన్నారు. 14 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారులకు ఉచితంగా విద్యనందించడానికి చట్టాలు ఉన్నాయన్నారు. వారిని తప్పకుండా బడికి పంపాలన్నారు. అంతకు ముందు విద్యార్థులతో జాతా నిర్వహించారు. అదనపు జిల్లాధికారి మహమ్మద్ జుబేర్, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బాల కార్మికత నిర్మూలనపై జాగృతి జాతా
రాయచూరు రూరల్: జిల్లాలో బాల కార్మికుల నియంత్రణకు బాల కార్మిక శాఖాధికారులు ముందుండాలని న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా ప్రాధికార కార్యదర్శి సాత్విక్ పేర్కొన్నారు. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద బాల కార్మిక నియంత్రణపై జాతాను ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో బాలలపై అధికంగా పని ఒత్తిడి పడుతోందన్నారు. దాని నివారణకు ప్రతి ఒక్కరూ శ్రమించాలన్నారు. జాతాలో పిల్లల సంరక్షణ మండలి జిల్లాధ్యక్షురాలు మంగళ, కమిషనర్ సిద్దలింగయ్య, బీఈఓ ఈరణ్ణ, బాల కార్మిక అధికారి హారతి, కార్మిక శాఖాధికారులు మంజునాథ్ రెడ్డి, అమరేష్లున్నారు.
విద్యాభ్యాసం చిన్నారుల హక్కు
న్యాయమూర్తి రాజేష్ హొసమనె

పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరం