లోకాయుక్తలో వసూల్‌ రాజాలు | - | Sakshi
Sakshi News home page

లోకాయుక్తలో వసూల్‌ రాజాలు

Jun 13 2025 4:49 AM | Updated on Jun 13 2025 4:49 AM

లోకాయుక్తలో వసూల్‌ రాజాలు

లోకాయుక్తలో వసూల్‌ రాజాలు

దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో అవినీతికి, లంచాలకు పాల్పడే అధికారులను గుర్తించి పట్టుకోవాల్సిన లోకాయుక్త అధికారులు.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వారే అక్రమాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. కొందరు అధికారులు పలు శాఖల నుంచి పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడినట్లు బయటకు రావడం తీవ్ర సంచలనం కలిగిస్తోంది. రాష్ట్రంలో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు దళారులను పెట్టుకుని, ప్రభుత్వ అధికారులను బెదిరించేవారు. మీపై ఫిర్యాదులు వచ్చాయని, ఇళ్లపై దాడి చేస్తామని బెదిరించి అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలోని అధికారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు.

దళారీ నింగప్ప అరెస్టు

ఇలా వసూలు చేసిన కోట్ల రూపాయలను బిట్‌ కాయిన్‌లో పెట్టుబడి పెట్టినట్టు సమాచారం. ఆ ఇద్దరు అధికారులపై సాక్ష్యాధారాలు లభించాయి. నింగప్ప అనే వ్యక్తిని లోకాయుక్త అధికారులు ట్రాప్‌ చేశారు. నింగప్ప ఇద్దరు అక్రమార్కుల సూచనల ప్రకారం ఎకై ్సజ్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారుల వద్ద భారీగా డబ్బులు గుంజేవాడు. లోకాయుక్త ఎస్పీ శ్రీనాథ్‌ జోషితో నింగప్ప రోజూ టచ్‌లో ఉన్నట్టు ఆరోపణలొచ్చాయి. కోట్ల రూపాయలు వసూలు చేసి శ్రీనాథ్‌కు ఇస్తే, అందులో కొంత వాటా అతనికి దక్కేది. గుట్టు కాస్త రట్టు కావడంతో శ్రీనాథ్‌ జోషిని ఉన్నతాధికారులు ఇటీవల బదిలీ చేశారు. అక్రమ వసూళ్లకు సంబంధించి త్వరలో మరిన్ని నగ్న సత్యాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

ఇద్దరు ఐపీఎస్‌లపై ఆరోపణలు

పలు శాఖల అధికారుల నుంచి భారీగా ముడుపులు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement