దేశానికి వెన్నెముక రైతన్న | - | Sakshi
Sakshi News home page

దేశానికి వెన్నెముక రైతన్న

Jun 12 2025 3:49 AM | Updated on Jun 12 2025 3:49 AM

దేశాన

దేశానికి వెన్నెముక రైతన్న

రాయచూరు రూరల్‌: రైతులు దేశానికి వెన్నెముక లాంటివారని, పల్లె సీమలే పట్టుకొమ్మలని, ముంగారు ఉత్సవాలు సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణలో ప్రధానమని సుత్తూరు వీర సింహాసన మహా సంస్థాన పీఠాధిపతి శివరాత్రి దేశీకేంద్ర మహాస్వామీజీ, కాశీ జ్ఞాన సింహాసనాధీశ్వర పీఠాధిపతి జగద్గురు డాక్టర్‌ మల్లికార్జున విశ్వారాధ్య శివాచార్య భగవత్పాదులు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని ఏపీఎంసీ ఆవరణలో మున్నూరు కాపు సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముంగారు ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక ఎద్దులకు రెండు టన్నుల రాతి దూలం లాగే పోటీలను ప్రారంభించి వారు మాట్లాడారు.

రైతులకు మొదటి పండుగ ఏరువాక పున్నమి

ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు పొలంలో విత్తనాలు చల్లుకొని పంటలు బాగా పండాలని కోరుకుంటూ బసవణ్ణకు పూజలు చేయడం, వాటిని ఊరేగించడం ఆనవాయితీ అన్నారు. రైతులకు మొదటి పండుగ ఏరువాక పున్నమి అని, ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు పొలాలను పదును చేసుకుంటారన్నారు. పోటీల్లో పది జతల ఎద్దులు పాల్గొన్నాయి. కార్యక్రమంలో వీరభద్ర శివాచార్య, అభినవ రాచోటి, శంభు సోమనాథ, బూది బసవ శివాచార్య, సిద్దలింగ శివాచార్య, మాజీ శాసన సభ్యులు పాపారెడ్డి, శాసన సభ్యులు శివరాజ్‌ పాటిల్‌, మున్నూరు కాపు సమాజం అధ్యక్షుడు నరసారెడ్డి, శేఖర్‌ రెడ్డి, క్రీడా సహాయ కార్యదర్శి పుండ్ల రాజేంద్రరెడ్డి, శ్రీనివాస రెడ్డి, అమరేష్‌, కేశవరెడ్డిలున్నారు.

ఉత్సవాలతో సంస్కృతి రక్షణ

శివరాత్రి దేశీకేంద్ర మహాస్వామీజీ

దేశానికి వెన్నెముక రైతన్న 1
1/1

దేశానికి వెన్నెముక రైతన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement