నిధుల స్వాహాపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

నిధుల స్వాహాపై కేసు నమోదు

May 27 2025 12:45 AM | Updated on May 27 2025 12:45 AM

నిధుల స్వాహాపై కేసు నమోదు

నిధుల స్వాహాపై కేసు నమోదు

ఐదు మంది నిందితుల్లో

మంత్రి అల్లుడి పేరు?

రాయచూరు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం వివిధ అభివృద్ధి పఽథకాల కింద కళ్యాణ కర్ణాటక పరిధిలోని కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బీదర్‌, బళ్లారి, విజయనగర జిల్లాల్లో పనులు చేయకుండానే రూ.25 కోట్లు వ్యయం చేసినట్లు నిధుల స్వాహాపై పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. రూ.25 కోట్లతో పనుల పేరుతో మంత్రి బంధువులతో కలిసి కేసు నమోదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టెండర్ల ద్వారా పనులు కల్పిస్తామని కాంట్రాక్టర్‌ వద్ద రూ.1.21 కోట్ల లంచం పుచ్చుకున్నట్లు కలబుర్గి స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కళ్యాణ కర్ణాటకలో కలబుర్గి లక్ష్మికాంత కట్టిమని, రాయచూరు సంతోష్‌ నాయక్‌, కిరణ్‌, బెంగళూరు శ్రీధర్‌, కొప్పళ జిల్లాలో రవి మాలిపాటిల్‌లు జల జీవన్‌ మిషన్‌(జేజేఎం) పథకంలో సబ్‌ కాంట్రాక్టులు పొందారు. కలబుర్గి లక్ష్మికాంత కట్టిమని తనకు ఉన్నతాధికారులు, మంత్రులతో పరిచయం ఉందని, పనులు కేటాయిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి వారి వద్ద నుంచి నిధులు కాజేశారని ఆరోపించారు. ప్రతి ఒక్క కాంట్రాక్టర్‌కు రూ.50 కోట్ల మేర కాంట్రాక్ట్‌లు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసిన వారిపై అధికారులు కేసు నమోదు చేయించారు. కాగా అధికారులు మంత్రి అల్లుడి పేరును వెల్లడించకుండా రహస్యంగా ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement