
పేదల ఆకలి తీర్చడమే ధ్యేయం
హొసపేటె: పేదల ఆకలి తీర్చేందుకే ఇందిరా క్యాంటీన్లు ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే గవియప్ప అన్నారు. విజయనగరం జిల్లా హోస్పేట తాలూకా హంపీ సమీపంలోని కమలాపూర్లో కొత్తగా నిర్మించిన ఇందిరా క్యాంటీన్ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ హంపీ, కమలాపురను సందర్శించే పర్యాటకులు, స్థానికంగా ఉన్న పేదల సౌలభ్యం కోసం బస్ స్టేషన్ సమీపంలో క్యాంటీన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రైవేట్ హోటళ్లలో టిఫిన్, భోజనం ధరలు పెరిగాయని, ఇందిరా క్యాంటీన్ ద్వారా తక్కువ ధరతో ఆహార పదార్థాలు లభిస్తాయన్నారు.

పేదల ఆకలి తీర్చడమే ధ్యేయం