కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు | - | Sakshi
Sakshi News home page

కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు

May 5 2025 9:04 AM | Updated on May 5 2025 9:04 AM

కష్టప

కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు

బళ్లారి అర్బన్‌: కష్టపడి చదువుకోవాలని సీనియర్‌ జానపద కళాకారుణి పద్మశ్రీ డాక్టర్‌ మాతా బీ మంజమ్మ జోగతి విద్యార్థులకు పిలుపునిచ్చారు. స్థానిక ఏఎస్‌ఎం మహిళా కళాశాలలో ప్రతిభా దినం, వివిధ సాంస్కృతిక సంఘాల ముగింపు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. జీవితంలో కష్ట సుఖాలు, నిందలు, అవమానాలు సహజమని, వీటిని సాకుగా చూపి ఎదగడానికి కృషి చేయకుండా ఉండరాదన్నారు. లక్ష్యాల సాధన కోసం నిరంతరము శ్రమించి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. తృతీయ లింగ వ్యక్తులను సమానంగా పరిగణించి ఉత్తమ విద్యను అందించాలని కోరారు. కళాశాల మండలి అధ్యక్షురాలు క్యాత్యాని.ఎం, పార్వతీష, సుమంగళ, చోరనూరు కొట్రప్ప, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ధూపం సతీష్‌, గవిసిద్ధప్ప, డాక్టర్‌ కే.గంగాధర, రీని, డాక్టర్‌ బింధు, డాక్టర్‌ సువర్ణమ్మ పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు 1
1/1

కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement