ఉద్రిక్తత నీడలో మంగళూరు | - | Sakshi
Sakshi News home page

ఉద్రిక్తత నీడలో మంగళూరు

May 3 2025 7:48 AM | Updated on May 3 2025 7:48 AM

ఉద్రి

ఉద్రిక్తత నీడలో మంగళూరు

బనశంకరి: సముద్రతీరం, వ్యాపార వాణిజ్యాలకు, విద్యాసంస్థలకు నెలవైన మంగళూరు నగరం మరోసారి ఉద్రిక్తత గుప్పిట్లో చిక్కుకుంది. హిందూ కార్యకర్త, రౌడీషీటర్‌ సుహాస్‌శెట్టి (32) దారుణ హత్యతో నగరంతో పాటు పరిసర ప్రదేశాల్లో టెన్షన్‌ నెలకొంది. హిందూ సంఘాలు శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చాయి, అంగళ్లు, ఆఫీసులను మూసివేయడంతో పాటు బస్సులు, వాహన సంచారం నిలిచిపోయింది. కొందరు వాహనాలపై రాళ్లు విసరడంతో కొన్ని బస్సులు దెబ్బతిన్నాయి. అల్లర్లు జరగకుండా జిల్లాధికారి శుక్రవారం నుంచి 6వ తేదీ వరకు దక్షిణ కన్నడ జిల్లాలో నిషేధాజ్ఞలను విధించారు.

హత్య కేసులో నిందితుడు..

2022లో సూరత్కల్‌లో జరిగిన ఫాజిల్‌ అనే వ్యక్తి హత్య కేసులో సుహాస్‌శెట్టి ప్రముఖ నిందితుడు. గురువారం రాత్రి 8.27 సమయంలో మంగళూరులో బజ్పేకిన్నిపదవు అనే ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు సుహాస్‌శెట్టిని నరికి చంపారు. ఈ హత్య గురించి తెలియగానే వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ తదితర హిందూ సంఘాల కార్యకర్తలు నిరసనలకు దిగారు.

ఇన్‌స్టాలో ముందే హెచ్చరించి హత్య

దుండగులు ముందుగానే సోషల్‌ మీడియాలో సుహాస్‌శెట్టికి హెచ్చరిక ఇచ్చారు. టార్గెట్‌ కిల్లర్‌ పేరుతో ఇన్‌స్టా పేజీని తెరిచారు. ఆ పోస్టులను సుహాస్‌శెట్టికి ట్యాగ్‌ చేశారు. ఫాజిల్‌, బషీర్ల హత్యలకు త్వరలోనే ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. ఇంతలోనే హత్య చేశారు. హత్యకు వాడిన కారు, ఇన్నోవా, గూడ్స్‌ వ్యాన్‌ని పోలీసులు పట్టుకున్నారు. కారులో కత్తులు, రాడ్లు వంటివి లభించాయి. గొడవలు చెలరేగకుండా అంతటా పోలీసులు మోహరించారు.

ర్యాలీగా అంతిమయాత్ర

సుహాస్‌శెట్టి మృతదేహాన్ని హిందూ సంఘాల నేతలు ఊరేగింపుగా బంట్వాళ తాలూకా ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం బీజేపీ ఎమ్మెల్యే కల్లడ్క ప్రభాకర్‌ భట్‌, అనేకమంది నాయకులు తరలివచ్చారు. మంగళూరు నుంచి 35 కిలోమీటర్లు దూరంలో గల కారంజీకి పార్థివదేహాన్ని వాహనంలో తరలించి అంత్యక్రియలను పూర్తిచేశారు. దారి పొడవునా పోలీసులు మోహరించారు.

ఆచూకీ తెలిసింది: ఏడీజీపీ

ఏడీజీపీ హితేంద్ర మంగళూరులో పరిస్థితి పరిశీలించారు. విలేకరులతో మాట్లాడుతూ హత్యకేసులో నిందితుల ఆచూకీ తెలిసిందని, చర్యలు తీసుకుంటామని చెప్పారు. సుహాస్‌శెట్టి భజరంగ్‌దళ్‌ కార్యకర్త అని, అతనిపై అనేక హత్యా ప్రయత్నం కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు.

హిందూ కార్యకర్త సుహాస్‌శెట్టి హత్య..

నగరంలో హిందూ సంఘాలచే బంద్‌

జిల్లాలో 6 వరకు నిషేధాజ్ఞలు

ఉద్రిక్తత నీడలో మంగళూరు 1
1/3

ఉద్రిక్తత నీడలో మంగళూరు

ఉద్రిక్తత నీడలో మంగళూరు 2
2/3

ఉద్రిక్తత నీడలో మంగళూరు

ఉద్రిక్తత నీడలో మంగళూరు 3
3/3

ఉద్రిక్తత నీడలో మంగళూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement