
అభివృద్ధి పనులకు భూమిపూజ
హొసపేటె: విజయనగర జిల్లా కొట్టూరు తాలూకాలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కే.నేమిరాజా నాయక్ భూమి పూజ చేశారు. కళ్యాణ కర్ణాటక అభివృద్ధి బోర్డు, డీఎంఎఫ్ ప్రాజెక్ట్ కింద తాలూకాలోని హరాలు, కన్ననాయకనకట్టె కే.అయ్యనహళ్లి, హోస కోడిహళ్లి, మోతికల్ తండా, మల్లనాయకనహళ్లి గ్రామాల్లో రూ.30 లక్షలు చొప్పున, గజాపూర్లో రూ.40 లక్షలు, తిమ్మలాపూర్ సన్నతండాలో రూ.20 లక్షలు వెరసి రూ.3.40 కోట్లతో పనులు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రాథమిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. జెడ్పీ మాజీ సభ్యుడు ఎంఎంజే హర్షవర్ధన్, ఏపీఎంసీ మాజీ అధ్యక్షుడు బూడి శివకుమార్, ఆయా గ్రామాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రభుత్వ సౌలభ్యాలను వినియోగించుకోవాలి
రాయచూరు రూరల్: అసంఘటిత కార్మికులు ప్రభుత్వ సౌలభ్యాలను వినియోగించుకోవాలని జిల్లా అదనపు న్యాయమూర్తి సాత్విక్ సూచించారు. మనోరంజన కేంద్రంలో జిల్లా కార్మికుల హక్కల వేదిక అద్వర్యంలో ఏర్పాటు చేసిన 137వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవంలో జడ్జి పాల్గొని మాట్లాడారు. అసంఘటిత కార్మికులకు మౌలిక సౌకర్యాలు, వేతనాలతో కూడిన సెలవులు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విశ్వ విద్యాలయ వైస్ చాన్సలర్ హన్మంతప్ప, జిల్లాకార్మిక అధికారిణి అరతి, శ్రీరామ, శ్రీకాంత్, హేమరాజ్, లక్ష్మప్ప, నరసింహులు, ఉరుకుందప్ప పాల్గొన్నారు.