చెరువులోకి పసిబిడ్డ.. కన్నతల్లి కర్కశత్వం | - | Sakshi
Sakshi News home page

చెరువులోకి పసిబిడ్డ.. కన్నతల్లి కర్కశత్వం

Dec 16 2024 1:47 AM | Updated on Dec 16 2024 1:16 PM

మరో బ

మరో బాలింత మృత్యువాత

బనశంకరి: ఓ కసాయి తల్లి రెండునెలల పసికందును చెరువులో పడేసి హత్య చేయడానికి ప్రయత్నించింది. తల్లి అనే పదానికే కళంకం తెచ్చేలా ప్రవర్తించింది. ఈ ఘటన బెళగావి నగరంలో ఆదివారం చోటుచేసుకుంది. ఆడపాపకు పుట్టుకతోనే మూర్ఛ వస్తుండేవి. చికిత్స చేయిస్తున్నా నయం కాలేదని, ఇటువంటి పాపను ఎలా పోషించాలని విసుక్కుంది. 

వెనుకా ముందు ఆలోచించకుండా తల్లి శాంతా కరవినకుప్పి (35).. ఆ పసిబిడ్డను సమీప చెరువులోకి పడేసింది. అక్కడే పశువులను కడుగుతున్న కొందరు గమనించి పాపను బయటకు తీసి బెళగావిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. మహిళను మాళమారుతి పోలీసులు అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement