రేపటి నుంచి జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్‌ | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్‌

Nov 28 2025 8:51 AM | Updated on Nov 28 2025 8:51 AM

రేపటి నుంచి జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్‌

రేపటి నుంచి జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్‌

● జిల్లా విద్యాధికారి శ్రీరామ్‌ మొండయ్య వెల్లడి

● జిల్లా విద్యాధికారి శ్రీరామ్‌ మొండయ్య వెల్లడి

కొత్తపల్లి(కరీంనగర్‌): కొత్తపల్లిలోని అల్ఫోర్స్‌ ఇ టెక్నో స్కూల్‌ వేదికగా ఈ నెల 29 నుంచి డిసెంబర్‌ 1వ తేదీ వరకు జిల్లాస్థాయి మెగా వైజ్ఞానిక, ఇన్‌స్పైర్‌ అవార్డుల ప్రదర్శన 2024–25ను నిర్వహిస్తున్నట్లు డీఈవో శ్రీరామ్‌ మొండయ్య వెల్లడించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనకు జిల్లావ్యాప్తంగా 717 నమూనాలు నమోదు చేయడం జరిగిందని, ఇందులో 7 జూనియర్‌, 7 సీనియర్‌ రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఇన్‌స్పైర్‌ అవార్డుల ప్రదర్శనకు 126 నమూనాలు నమోదు చేయబడ్డాయని, ఇందులో 13 నమూనాలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్‌ ఇ టెక్నో స్కూల్‌లో అల్ఫోర్స్‌ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, జిల్లా సైన్స్‌ అధికారి జయపాల్‌ రెడ్డిలతో కలిసి గురువారం మాట్లాడారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయడానికి ఈ ప్రదర్శన విశేషంగా దోహదపడుతుందన్నారు. ఎంఈవో ఆనందం, డీసీఇబీ కార్యదర్శి భగవంతరావు, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లా అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌ సమన్వయకర్త అనంతచార్య, జిల్లా ప్రణాళిక సమన్వయకర్త మిల్కూరి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement