పోలీసులు హై అలర్ట్
న్యూస్రీల్
మంగళవారం శ్రీ 11 శ్రీ నవంబర్ శ్రీ 2025
కరీంనగర్క్రైం: ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో కారులో పేలుడు ఘటన నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సోమవారం రాత్రి నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సిటీలోని ఆర్టీసీ బస్టాండ్, కార్గో పార్సెల్ కేంద్రం, వాహన తనిఖీలు, ఇతర రద్దీ ప్రదేశాలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో బాంబు స్క్వాడ్, పోలీస్ జాగిలాల బృందాలు పాల్గొన్నాయి. పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నెం. 8712670744 నంబర్కు సమాచారం ఇవ్వాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. దేశభద్రతకు విఘాతం కలిగించేలా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవన్నారు.
పోలీసులు హై అలర్ట్
పోలీసులు హై అలర్ట్


