2న స్కాలర్‌షిప్‌ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

2న స్కాలర్‌షిప్‌ పరీక్ష

Oct 26 2025 8:25 AM | Updated on Oct 26 2025 8:25 AM

2న స్

2న స్కాలర్‌షిప్‌ పరీక్ష

విద్యానగర్‌(కరీంనగర్‌): పేద విద్యార్ధులకు ఫీజు రాయితీతో కూడిన కార్పొరేట్‌ విద్య అందించేందుకు నవంబర్‌ 2న పదోతరగతి విద్యార్థులకు శ్రీచైతన్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో స్కాలర్‌షిప్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు చైర్మన్‌ ఎం.రమేశ్‌రెడ్డి తెలిపారు. స్కాలర్‌షిప్‌ పరీక్షల పోస్టర్లను శనివారం కరీంనగర్‌లోని శ్రీచైతన్య కళాశాలలో ఆవిష్కరించారు. పదోతరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతిభ ఆధారంగా వందశాతం ఫీజు రాయితీతో కూడిన విద్యను అందించడానికి పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష, రిజిస్ట్రేషన్‌ వివరాలకు 9848587584, 9912349038 నంబర్లను సంప్రదించాలని సూచించారు. పరీక్ష రాసే విద్యార్థులకు లక్కీడ్రా నిర్వహిస్తామని, మొదటి బహుమతిగా ఎల్‌ఈడీ టీవీ, రెండో బహుమతిగా సైకిల్‌, మూడో బహుమతిగా సెల్‌ఫోన్‌ అందిస్తామని అన్నారు. కళాశాల డైరెక్టర్‌ కర్ర నరేందర్‌రెడ్డి, జూనియర్‌ కళాశాలల డీన్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

పాఠ్యప్రణాళికా సంఘం సభ్యుడిగా మోహన్‌

సిరిసిల్లకల్చరల్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు పాఠ్య ప్రణాళికా సంఘం సభ్యుడిగా జిల్లాకు చెందిన కవి, కేంద్రసాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్‌ పత్తిపాక మోహన్‌ ఎంపికయ్యారు. రెండేళ్లపాటు కొనసాగనున్నారు. గతంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కన్సల్టేటీవ్‌ కమిటీ సభ్యుడిగా, అగ్రహారం డిగ్రీ కళాశాల ప్లానింగ్‌, డెవలప్‌మెంట్‌ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం నేషనల్‌ బుక్‌ ట్రస్టు దక్షిణ ప్రాంత అధికారిగా, తెలుగు సంపాదకుడిగా కొనసాగుతున్నారు.

2న స్కాలర్‌షిప్‌ పరీక్ష1
1/1

2న స్కాలర్‌షిప్‌ పరీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement