ఎన్నాళ్లీ అణచివేత | - | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లీ అణచివేత

Oct 17 2025 6:36 AM | Updated on Oct 17 2025 6:36 AM

ఎన్నా

ఎన్నాళ్లీ అణచివేత

సాక్షి కార్యాలయాల్లో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు హల్‌చల్‌ చేయడం సరికాదని రాజకీయ, ప్రజా సంఘాల నేతలు, సామాన్యులు ధ్వజమెత్తారు. జర్నలిస్టుల స్వేచ్ఛపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని ఆరోపించారు. పత్రికా స్వేచ్ఛను హ రిస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని మండిపడ్డారు. ‘సాక్షి’ ఎడిటర్‌ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు బనాయించడం సరికాదన్నారు.

కక్షపూరిత చర్య

ప్రజాస్వామ్య పద్ధతిలో పోలీసులు వ్యవహరించాలి. పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఇది ముమ్మాటికి కక్షపూరిత చర్యే. ప్రతీ అంశంపై ప్రజలను చైతన్యవంతం చేయడమే మీడియా ఉద్దేశం. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతున్నారనే అక్కసుతో కేసులు నమోదు చేయడం సరికాదు.

– మిర్యాల రాజిరెడ్డి,

టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు

కేంద్రం స్పందించాలి

మూడు రోజులుగా ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్‌, పాత్రికేయులపై కేసులు నమోదు చేసి బెదిరింపులకు దిగడం సరికాదు. సోదాలు నిర్వహించడం, వార్త సోర్స్‌ను అడగడం రాజ్యాంగ విరుద్ధం. ఈవిషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. పత్రికాస్వేచ్ఛను కాపాడాలి. అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు నమోదు చేయడం సిగ్గు చేటు.

– యాదగిరి సత్తయ్య, బీఎంఎస్‌ అధ్యక్షుడు

కక్షసాధింపు

ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచే పత్రికలపై కక్షసాధింపు సరికాదు. వైఫల్యాలను ఎత్తిచూపే పత్రికలపై రాజకీయ కక్షలు తగవు. ప్రసార మాధ్యమాల గొంతు వినిపించే హక్కును కాలరాయవద్దు. జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం అప్రజాస్వామికం.

– గంగుల కమలాకర్‌, కరీంనగర్‌ ఎమ్మెల్యే

పత్రికా స్వేచ్ఛను హరించడమే

పత్రికల్లో, ప్రసారమాద్యమాల్లో వార్తలు ప్రచురించినప్పుడు, వారి మనోభావాలు దెబ్బతిన్నాయని భా విస్తే న్యాయపోరాటం చేయాలి. ఇలా బెదిరింపు ధోరణితో పత్రికా స్వేచ్ఛను హరించివేయడం సరికాదు.

– పంజాల శ్రీనివాస్‌,

సీపీఐ జిల్లా కార్యదర్శి, కరీంనగర్‌

ఎన్నాళ్లీ అణచివేత1
1/4

ఎన్నాళ్లీ అణచివేత

ఎన్నాళ్లీ అణచివేత2
2/4

ఎన్నాళ్లీ అణచివేత

ఎన్నాళ్లీ అణచివేత3
3/4

ఎన్నాళ్లీ అణచివేత

ఎన్నాళ్లీ అణచివేత4
4/4

ఎన్నాళ్లీ అణచివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement