
ఒక్కవానకే చిత్తు!
నగరంలోని జ్యోతినగర్ మోర్ సూపర్ మార్కెట్నుంచి మంకమ్మతోట వైపు వెళ్లే రోడ్డు ఇది. సీఎం హమీ పథకం కింద ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టగా మధ్యలోనే నిలిచిపోయింది. జ్యోతినగర్ నుంచి మంకమ్మతోట, కాశ్మీర్గడ్డ తదితర ప్రాంతాలకు మెయిన్ లింక్ రోడ్డు కావడంతో వాహనాల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. రెండేళ్లుగా ఈ రోడ్డు బాగుపడడం లేదు. ప్రజలకు ఇబ్బంది తప్పడం లేదు.
నగరంలోని కోతిరాంపూర్ నుంచి కట్టరాంపూర్కు వెళ్లే ప్రధాన రోడ్డు ఇది. కోతి బొమ్మ నుంచి గిద్దెపెరుమాండ్ల ఆలయం వరకు రోడ్డు పూర్తికాగా, తరువాత వదిలేశారు. అప్పటి నుంచి ఈ రోడ్డు వెంట ప్రయాణం నరకంగా మారింది. వర్షం కురియడంతో గుంతల రోడ్డుతో ఇబ్బంది పడుతున్నారు.

ఒక్కవానకే చిత్తు!

ఒక్కవానకే చిత్తు!